+91 95819 05907

మానుకోటపై ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే

– బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
– విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మానుకోట (మహబూబాబాద్) పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రిపీట్ కానున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలను అమలు చేశారని ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో రైతుబంధు, రైతు భీమ, రుణమాఫీ తదితర కార్యక్రమాలను అతి త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ప్రజలు ఆశించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం రానున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోట అని, ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ప్రతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసే ఒక్కో ఓటు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, గుంటక శేషిరెడ్డి, బండారు ముత్యాలరావు, సారపాక గాంధీనగర్ ని ముఖ్య కార్యకర్తలు సైదులు, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, గంగరాజు, శ్రీను, శంకర్, కామేశ్వరి, పాండు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !