+91 95819 05907

మానుకోటపై ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే

– బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
– విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మానుకోట (మహబూబాబాద్) పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రిపీట్ కానున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలను అమలు చేశారని ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో రైతుబంధు, రైతు భీమ, రుణమాఫీ తదితర కార్యక్రమాలను అతి త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ప్రజలు ఆశించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం రానున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోట అని, ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ప్రతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసే ఒక్కో ఓటు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, గుంటక శేషిరెడ్డి, బండారు ముత్యాలరావు, సారపాక గాంధీనగర్ ని ముఖ్య కార్యకర్తలు సైదులు, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, గంగరాజు, శ్రీను, శంకర్, కామేశ్వరి, పాండు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !