+91 95819 05907

మానుకోటపై ఎగరబోయేది కాంగ్రెస్ జెండానే

– బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
– విస్తృత ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నాయకులు

నేటి గద్దర్, మే 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మానుకోట (మహబూబాబాద్) పై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలే, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రిపీట్ కానున్నాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారంటీలను అమలు చేశారని ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో రైతుబంధు, రైతు భీమ, రుణమాఫీ తదితర కార్యక్రమాలను అతి త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ప్రజలు ఆశించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ రాజ్యం రానున్నదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోట అని, ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకోవాలని కోరారు. ప్రతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసే ఒక్కో ఓటు రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, గుంటక శేషిరెడ్డి, బండారు ముత్యాలరావు, సారపాక గాంధీనగర్ ని ముఖ్య కార్యకర్తలు సైదులు, ఈశ్వర్, కళ్యాణ్, అజయ్, గంగరాజు, శ్రీను, శంకర్, కామేశ్వరి, పాండు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !