+91 95819 05907

ఓటు వేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

– దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

నేటి గద్దర్, మే 13, ములుగు :

దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉద్దేశపూరితమైనటువంటి రాజకీయాలు యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని వెల్లడించారు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, వందలాది ఉద్యోగాలు సృష్టించారని కానీ ప్రస్తుతం ఆ సంస్థలన్నీ అమ్మబడుతున్నాయని సీతక్క విమ ర్శించారు. ప్రధాని అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతు న్న వారిని ప్రజలు విస్మరించాలని కోరారు. రాజకీయాల్లో మాత్రమే విద్వేషాలు ఉంటాయని మిగతా సమయంలో సోదర భావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసిన తహసీల్దార్ రజనీకుమారి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Read More »

 Don't Miss this News !