+91 95819 05907

ఓటు వేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

– దేశంలో విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి

– రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

నేటి గద్దర్, మే 13, ములుగు :

దేశంలో విద్వేష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయని రాజ్యాంగం కల్పిం చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఉద్దేశపూరితమైనటువంటి రాజకీయాలు యువత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జూడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయలేని మూఢత్వంలో కొందరు ఉన్నారని, అది సరికాదని వెల్లడించారు. దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే వారు స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ నెహ్రూ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, వందలాది ఉద్యోగాలు సృష్టించారని కానీ ప్రస్తుతం ఆ సంస్థలన్నీ అమ్మబడుతున్నాయని సీతక్క విమ ర్శించారు. ప్రధాని అంబానీల కోసం దేశాన్ని తాకట్టు పెడుతు న్న వారిని ప్రజలు విస్మరించాలని కోరారు. రాజకీయాల్లో మాత్రమే విద్వేషాలు ఉంటాయని మిగతా సమయంలో సోదర భావంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !