+91 95819 05907

ప్రశాంత వాతావరణంలో ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు

నేటి గద్దర్, మే 13, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బూర్గంపాడు మండలంలోని 57 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి . మండల వ్యాప్తంగా మొత్తం 49813 మంది ఓటర్లు కు గాను మహిళలు పురుషులతో కలిపి 30809 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మండల వ్యాప్తంగా 61.85 శాతం నమోదు అయింది . కాగా అత్యధిక పోలింగ్ శాతం 241 పోలింగ్ కేంద్రంలో 88.07 శాతం నమోదు కాగా అత్యాల్పంగా 200 పోలింగ్ కేంద్రం వద్ద 21. 79 శాతం నమోదయింది .ఉదయం7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసేందుకు సమయం ఉండడంతో నాలుగు గంటల తరువాత పలు పోలింగ్ కేంద్రాల్లో పదుల సంఖ్యలో ఓటర్లు వేచి ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు గంటల సమయం ముగిసిన తర్వాత ఓటర్లు ఓటు వేసేందుకు రావడంతో అధికారులు సమయం అయిపోయినది అని చెప్పడంతో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత ఓటర్లు రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. ప్రొసీడింగ్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పిఓపిఓ తోపాటు ముగ్గురు ఓపివోలు సిబ్బంది పాల్గొన్నారు .వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్లు సహాయంతో తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండటంతో . జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై సుమన్ అదనపు ఎస్సై నాగబిక్షం ల ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదన బలగాలను ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మండల కేంద్రంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య స్వల్ప గర్షణ చోటుచేసుకుంది పోలీసులు కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది .144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఉదయం నుంచి అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు జరిగినప్పటికీ మండల వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ లో ఓటర్లు పాల్గొన్నారు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !