+91 95819 05907

Mlc ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్స్ ఓటు వేసిన మురిగి పోతున్నాయి .! అలా జరగకుండా ఉండాలి అంటే

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:

తెలంగాణలో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు వచ్చాయి.

★అన్ని వర్గాల వారూ ఓట్లు వేసే సాధారణ ఎన్నికల కంటే.. అందరూ డిగ్రీ పైన చదువుకున్న వారు, పిల్లలకు పాఠాలు చెప్పే వారు ఓట్లు వేసే ఈ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

★ తెలంగాణ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గంలో 21 వేలకు పైగా చెల్లని ఓట్లు వచ్చాయి.

★మామూలు ఎన్నికల్లో వంద ఓట్లు ఉండి, ఒకరికి 100 రెండో వారికి 65, మూడో వారికి 40, నాలుగో వారికి 30 ఓట్లు వచ్చాయి అనుకుంటే.. అప్పుడు 100 ఓట్లు వచ్చిన మొదటి వ్యక్తి గెలిచినట్టు. కానీ ఇక్కడ ఆ మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా 135 ఓట్ల వచ్చాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతేకాదు. కనీసం ఓటేసిన వారిలో సగం మంది కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వలేదని అర్థం.
★★★★★★★★★★
★Mlc ఎన్నికల్లో ఓటు వేయడం ఎలా..?
★★★★★★★★★★

పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన వెంటనే జాబితాలో మీ పేరును అధికారులు తనిఖీ చేస్తారు. ఏదేని ఒక ఐడీ కార్డును చూసి.. ఓటును నిర్ధారించుకున్న తర్వాత లిస్టులో టిక్ పెడతారు. అనంతరం మీ చేతికి బ్యాలెట్ పేపర్‌తో పాటు పెన్ను ఇస్తారు
◆ బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో రాసి ఉంటాయి. అభ్యర్థి పేరుకు ఎదురుగా గడీలు ఉంటాయి. అందులో మీకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత సంఖ్యను వేయాల్సి ఉంటుంది.
◆ఖాళీ గడీల్లో ప్రాధాన్యత సంఖ్యను సాధారణ అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ పెట్టకూడదు. వేలి ముద్రలు, రోమన్ అంకెలు వేయకూడదు. అలా చేస్తే ఆ ఓటు చెల్లదు.

★పోలింగ్ కేంద్రంలో అధికారి ఇచ్చే ఉదా రంగు కలర్ స్కెచ్ పెన్‌తో మాత్రమే ప్రాధాన్యతా సంఖ్యను వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా వేయాలి. తర్వాత అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యత సంఖ్యను వేస్తూ వెళ్లవచ్చు.
◆ఓటు ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను మినహాయించి, ఆ తర్వాత నుంచి కొనసాగించకూడదు. ఉదాహరణకు 1, 2, 3, 5, 6, 7, 8 ఇలా ప్రాధాన్యత ఇస్తేతే.. మధ్యలో ‘4’ మిస్‌ అయినందున 3 వరకే ప్రాధాన్యత క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

★ఒక్క అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి ’1’ అని ఇస్తే ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా అది చెల్లదు.
◆బ్యాలెట్ పేపర్లో ఉన్న అభ్యర్థుల్లో ఎంత మందికైనా ఓటు వేసుకోవచ్చు. కేవలం ఒక్కరికి కూడా వేయవచ్చు. ఇద్దరు, ముగ్గురికి కూడా మద్దతు తెలపవచ్చు. కానీ ప్రాధాన్యత క్రమాన్ని మరవకూడదు.

మీ నియోజకవర్గంలో 71 మంది పోటీల్లో ఉంటే.. 71 మందికి ఓటు వేయవచ్చు. ఐతే 1 నుంచి 71 వరకు అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడీల్లో నెంబర్లను రాయాల్సి ఉంటుంది.

★ఏ ఎన్నికల్లోనైనా ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ భిన్నంగా ఉంటుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. ఒక అభ్యర్థికి 50 శాతం+1 వచ్చేదాకా.. 1,2,3 ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీతో పాటు, తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో ఎవరూ గెలవలేదు. 2వ ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది.

గ్రాడ్యుయేట్స్ ఓటు వేస్తున్నప్పుడు తప్పక పై సూచనలు పాటించండి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !