+91 95819 05907

TS స్థానంలో TGగా మార్చాలి:కలెక్టర్

◆అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ

◆జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 18:

పిఎస్ యు,ప్రభుత్వ రంగ సంస్థలు,ఏజెన్సీలు పేర్లులో
టిఎస్ బదులుగా టిజి గా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే ‘టీఎస్’ స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు.మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుమతులు రాగా,తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్ కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారి చేసినట్లు తెలిపారు.ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు,పీఎస్ యులు,ఏజెన్సీల పేర్ల ముందు టిఎస్ కు బదులు టిజి గా మార్చాలని ఆదేశించారు.ఉదాహరణకు టీఎస్ఎన్పిడిసిఎల్ పేరును ఇక నుండి టిజిఎన్పిడిసిఎల్ గాను, టీఎస్ఆర్టీసీ పేరును
టిజిఆర్టీసీగా మార్చాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు,ఏజెన్సీలు,స్వయం ప్రతిపత్తి గల సంస్థలు,ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టిజితో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని ఆమె సూచించారు.లెటర్ హెడ్లు, రిపోర్టులు,నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్,పాలసీ పేపర్లు, జీవోలు,ఇతర అధికారిక
కమ్యూనికేషన్ల అన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని ఆమె పేర్కొన్నారు.శాఖలు ద్వారా భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర,ప్రత్యుత్తరాలలో టీఎస్ కు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు.ఈమేరకు తీసుకున్న చర్యలపై ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని,అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !