+91 95819 05907

TS స్థానంలో TGగా మార్చాలి:కలెక్టర్

◆అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ

◆జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 18:

పిఎస్ యు,ప్రభుత్వ రంగ సంస్థలు,ఏజెన్సీలు పేర్లులో
టిఎస్ బదులుగా టిజి గా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే ‘టీఎస్’ స్థానంలో టీజీని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు.మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుమతులు రాగా,తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో టీఎస్ కు బదులుగా టీజీని వినియోగించేందుకు అనుమతి జారి చేసినట్లు తెలిపారు.ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు,పీఎస్ యులు,ఏజెన్సీల పేర్ల ముందు టిఎస్ కు బదులు టిజి గా మార్చాలని ఆదేశించారు.ఉదాహరణకు టీఎస్ఎన్పిడిసిఎల్ పేరును ఇక నుండి టిజిఎన్పిడిసిఎల్ గాను, టీఎస్ఆర్టీసీ పేరును
టిజిఆర్టీసీగా మార్చాలని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు శనివారం సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు,ఏజెన్సీలు,స్వయం ప్రతిపత్తి గల సంస్థలు,ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టిజితో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని ఆమె సూచించారు.లెటర్ హెడ్లు, రిపోర్టులు,నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్,పాలసీ పేపర్లు, జీవోలు,ఇతర అధికారిక
కమ్యూనికేషన్ల అన్నింటిపై టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలని ఆమె పేర్కొన్నారు.శాఖలు ద్వారా భవిష్యత్తులో నిర్వహించే ఉత్తర,ప్రత్యుత్తరాలలో టీఎస్ కు బదులుగా టీజీని ముద్రించాలని సూచించారు.ఈమేరకు తీసుకున్న చర్యలపై ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారులు నివేదికలు పంపాలని,అట్టి నివేదికలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !