+91 95819 05907

యుద్ధం ఇంకా మిగిలే ఉంది.565 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న కావాలా? బిట్స్ పిలాని విద్యావంతుడు కావాలా?Dr RSP

★ యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న

★ రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న మల్లన్న

★ నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?

★ నిరుద్యోగ భృతి ఏది?

★ మెగా డీఎస్సీ ఏది?
★ ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత?
★ అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న
★ 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా?

★ సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి

★ రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి

★ ఆశయం కావాలా? అహంకారం కావాలా?

★ తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం

★ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి

★ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

565 కేసులు ఉన్న తీన్మార్ మల్లన్న కావాలా? Bits Pilani విద్యావంతుడు కావాలా? తెలంగాణ రాష్ట్రంలో విద్యావంతులు మేధావులు, ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలని BRS రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సబండ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నాడో వివరిస్తూ… ఆరు నెలల కాంగ్రెస్ పాలనను సైతం దుయ్యబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిన ప్రతిసారి నిరుద్యోగుల నుండి భారీ స్పందన లభించింది . తెలంగాణ రాష్ట్రం తన ఉనికి కోసం మరో యుద్ధం ప్రారంభించిందని… తెలంగాణ శ్రేణులు ఈ యుద్ధంలో పాల్గొని బీ ఆర్ ఎస్ కి మద్దతు తెలపాలన్నారు.యూట్యూబ్ ఛానల్ ను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ కి పాల్పడిన Congrees పార్టీ Mlc అభ్యర్థి మల్లన్న
రైతుబంధు పడలేదని అడిగినందుకు రైతులను చెప్పుతో కొడతా అన్న విషయం యావత్ తెలంగాణ సమాజం రైతన్నలు మరవకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏది? మెగా డీఎస్సీ ఏది? ఉద్యోగస్తులకు పెంచిన డిఎ ఎంత? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్రమాల పుట్ట తీన్మార్ మల్లన్న. 70 రోజులు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవించిన విషయం వాస్తవం కాదా? అన్నారు. వాస్తవాలను ప్రచారం చేయడం … ముఖ్యంగా తెలంగాణ మహాత్ముడు కెసిఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పబ్బం గడిపాడే తప్ప… ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. సౌమ్యుడు, రైతు బిడ్డ, వివాద రహితుడు , సామాజిక సేవలో దిట్ట నల్లగొండ BRS ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. రూ కోట్ల వార్షిక వేతనాన్ని వదులుకొని అగ్రరాజ్యం నుండి ప్రజాసేవకే వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి అని అన్నారు. ఆశయం కావాలా? అహంకారం కావాలా?. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేది ఈ యుద్ధం. బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు లు ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ని 9సార్లు కలవాలి అని సూచించారు. రాకేష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !