+91 95819 05907

సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి

నేటి గదర్, మే 21, భద్రాద్రి కొత్తగూడెం / బూర్గంపాడు :

దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండలం అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దుగ్గెంపూడి మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత రాజీవ్ గాంధీ కి చెందుతుందన్నారు. దేశంలో బీదరికాన్ని పారదోలిన నాయకుడని, భారతదేశం సాంకేతిక విప్లవానికి ఆధ్యులు నవభారత నిర్మాణ సారధి రాజీవ్ అని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలను భారతదేశానికి పరిచయం చేసిన భవిష్యత్తుకు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ను భారతదేశానికి తీసుకువచ్చి దేశ అభివృద్ధికి బాటలు వేసిన అపర మేధావి అని, భావితరాలకు పూజ్యులు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన దేశం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన త్యాగధనులు భారతరత్న దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ సొసైటీ చైర్మన్ పోతురెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మైముద్ ఖాన్, పినపాక నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, కాంగ్రెస్ నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !