+91 95819 05907

ఇంటర్మీడియట్,పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించిన:ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 25:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా సత్కరించారు.జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పిల్లలు 35 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులను అభ్యసించి మంచి ర్యాంకులను సాధించి తమ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్బంగా ఎస్పీ సూచించారు.పోలీస్ శాఖలో అహర్నిశలు ఎంతో కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న తమ తల్లీదండ్రుల కలలను సాకారం చేయాలని తెలిపారు.జీవితంలో నీతి,నిజాయితీ పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తెలియజేసారు.ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు.ఈ దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకొని తల్లిదండ్రులు గర్వపడేలా నడుచుకోవాలని సూచించారు.పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తాను కూడా తన తల్లీదండ్రుల కష్టం,కృషి వల్లనే కష్టపడి చదివానని తెలియజేసారు.ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే వరకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాల పిల్లలకు వారి తల్లీదండ్రుల సమక్షంలో ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎంటిఓ సుధాకర్,ఆర్ఐ హోమ్ గార్డ్స్ నరసింహరావు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !