+91 95819 05907

ఇంటర్మీడియట్,పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించిన:ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 25:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా సత్కరించారు.జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పిల్లలు 35 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులను అభ్యసించి మంచి ర్యాంకులను సాధించి తమ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్బంగా ఎస్పీ సూచించారు.పోలీస్ శాఖలో అహర్నిశలు ఎంతో కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న తమ తల్లీదండ్రుల కలలను సాకారం చేయాలని తెలిపారు.జీవితంలో నీతి,నిజాయితీ పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తెలియజేసారు.ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు.ఈ దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకొని తల్లిదండ్రులు గర్వపడేలా నడుచుకోవాలని సూచించారు.పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తాను కూడా తన తల్లీదండ్రుల కష్టం,కృషి వల్లనే కష్టపడి చదివానని తెలియజేసారు.ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే వరకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాల పిల్లలకు వారి తల్లీదండ్రుల సమక్షంలో ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎంటిఓ సుధాకర్,ఆర్ఐ హోమ్ గార్డ్స్ నరసింహరావు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !