+91 95819 05907

ఇంటర్మీడియట్,పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించిన:ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం మే 25:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన పోలీస్ సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఘనంగా సత్కరించారు.జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పని చేస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బంది పిల్లలు 35 మంది విద్యార్థినీ, విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులను అభ్యసించి మంచి ర్యాంకులను సాధించి తమ తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్బంగా ఎస్పీ సూచించారు.పోలీస్ శాఖలో అహర్నిశలు ఎంతో కష్టపడి విధులు నిర్వర్తిస్తున్న తమ తల్లీదండ్రుల కలలను సాకారం చేయాలని తెలిపారు.జీవితంలో నీతి,నిజాయితీ పట్టుదలతో సాధిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని తెలియజేసారు.ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదివే దశలోనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు.ఈ దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకొని తల్లిదండ్రులు గర్వపడేలా నడుచుకోవాలని సూచించారు.పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తాను కూడా తన తల్లీదండ్రుల కష్టం,కృషి వల్లనే కష్టపడి చదివానని తెలియజేసారు.ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరే వరకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాల పిల్లలకు వారి తల్లీదండ్రుల సమక్షంలో ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎంటిఓ సుధాకర్,ఆర్ఐ హోమ్ గార్డ్స్ నరసింహరావు,ఆర్ఐ ట్రైనింగ్స్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !