+91 95819 05907

శ్రమకు తగ్గ ఫలితం దక్కేనా..?

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి…

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు: గడ్డం స్వామి.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి భద్రాచలం మే 25:

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని,ఉపాధి పని చేస్తున్న కూలీలకు కనీసం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భద్రాచలం పట్టణ శివారులో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి పర్యటించారు.శ్రమకు తగ్గ ఫలితం రావడంలేదని, మండుటెండలో పనిచేసిన రోజు కూలి 90 రూపాయల లోపు పడుతుందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి పని ప్రదేశంలో టెంట్లు, మంచినీరు మొదలగు సౌకర్యాలు అందుబాటులో లేవని కూలీలు వాపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ ఉపాధి పథకం ఎవరి దయాదాక్షిన్యాల వల్ల రాలేదని 2004లో వామపక్షాలు నిర్వహించిన పోరాటాలు, పార్లమెంటులో వారి కృషి ఫలితంగా ఉపాధి చట్టం వచ్చిందని దీనిని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు సరైనా వేతనాలు రాకపోవడం దారుణమని అన్నారు.ఉపాధి పని ప్రదేశాలలో టెంట్లు, మంచినీరు సౌకర్యాలు ఉండాలని చట్టంలో చెబుతున్న అవి అమలు జరగకపోవడం అన్యాయమని అన్నారు.ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని,కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలి 600 వందల రూపాయలు ఇవ్వాలని,పని ప్రదేశాలలో మంచినీరు టెంట్లు మొదలగు సౌకర్యాలు కల్పించాలని పలుగు,పారా పదునుకు ప్రత్యేక నిధి కేటాయించాలని గడ్డం స్వామి డిమాండ్ చేశారు.ఈ పర్యటన కార్యక్రమంలో కొర్స రమణ,రాధా,నాగమణి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !