+91 95819 05907

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నేటి గదర్, మే 26, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏడిఏ తాతారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ లు అన్నారు. సోంపల్లి రెవిన్యూ పరిధిలోని రైతులకు వివిధ అంశాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు పాల్గొని మాట్లాడుతూ… రైతులందరూ నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎవరైనా గుడ్డ సంచులలో, నకిలీ లేబుల్ ఉన్న ప్యాకెట్లలో విత్తనాలు అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితులోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని, లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ నుంచి మాత్రమే విత్తనాలను తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును జాగ్రత్తపరచుకోవాలని తెలిపారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ మాట్లాడుతూ… గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న పురుగుల యొక్క గుడ్లు లార్వాలను నశింపచేయొచ్చని తెలిపారు. అదే విధంగా జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. మట్టి పరీక్ష నమూనాలను ఏ విధంగా సేకరించాలని, మట్టి పరీక్ష ఫలితాల విశ్లేషణ గురించి తెలియజేశారు. అదే విధంగా వరి పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా జరిగే అనర్ధాలను గురించి రైతులకు వివరించారు. అనంతరం మండలంలోని లక్ష్మీ పురం, సారపాక, బూర్గంపాడులో గల విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ… రైతులకు విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే వారికి బిల్లులను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్, రైతులు గాదె నర్సిరెడ్డి, దనుగూరి నాగేశ్వరరావు, బోరెం శ్రీనివాసరావు, చలకంటి సత్యం, పండగ చిట్టెయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !