+91 95819 05907

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి

నేటి గదర్, మే 26, బూర్గంపాడు / భద్రాద్రి కొత్తగూడెం :

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ఏడిఏ తాతారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ లు అన్నారు. సోంపల్లి రెవిన్యూ పరిధిలోని రైతులకు వివిధ అంశాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు పాల్గొని మాట్లాడుతూ… రైతులందరూ నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఎవరైనా గుడ్డ సంచులలో, నకిలీ లేబుల్ ఉన్న ప్యాకెట్లలో విత్తనాలు అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితులోనూ అటువంటి వారి వద్ద విత్తనాలు తీసుకోవద్దని, లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ నుంచి మాత్రమే విత్తనాలను తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లును జాగ్రత్తపరచుకోవాలని తెలిపారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శంకర్ మాట్లాడుతూ… గ్రామాలలో ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమి లోపల పొరల్లో ఉన్న పురుగుల యొక్క గుడ్లు లార్వాలను నశింపచేయొచ్చని తెలిపారు. అదే విధంగా జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలను రైతులకు వివరించారు. మట్టి పరీక్ష నమూనాలను ఏ విధంగా సేకరించాలని, మట్టి పరీక్ష ఫలితాల విశ్లేషణ గురించి తెలియజేశారు. అదే విధంగా వరి పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా జరిగే అనర్ధాలను గురించి రైతులకు వివరించారు. అనంతరం మండలంలోని లక్ష్మీ పురం, సారపాక, బూర్గంపాడులో గల విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ… రైతులకు విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే వారికి బిల్లులను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్, రైతులు గాదె నర్సిరెడ్డి, దనుగూరి నాగేశ్వరరావు, బోరెం శ్రీనివాసరావు, చలకంటి సత్యం, పండగ చిట్టెయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !