+91 95819 05907

ఎదుర్కొనే వాడే నిజమైన కమ్యూనిస్టు

 
– పేదల రాజ్యం కోసమే సిపిఎం పార్టీ పనిచేస్తుంది
– సిపిఎం రాష్ట్ర సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు

నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
(అలవాల వంశీ 9052354516)

భారతదేశంలో సిపిఎం ది త్యాగాల చరిత్ర అని, కష్టాలను ఎదుర్కొన్న వాడే నిజమైన కమ్యూనిస్టు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు మండలం పగిడేరు పంచాయతీలో కుంజ కృష్ణకుమారి ప్రాంగణం లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల కార్యదర్శి కొడిశాల రాములు, ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ కార్యక్రమం విశిష్టత బోధించారు. దేశంలో మూడు రాష్ట్రాలలో 9 మంది ముఖ్యమంత్రులు పనిచేశారని పేదల సంక్షేమం కోసం సంక్షేమం కోసం తప్ప ఎవరి మీద ఎలాంటి మచ్చలేదని అన్నారు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాట ఫలితాలను ప్రజలకు అందించకుండా ప్రజలను దోపిడీ గురిచేసిందన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి, కాంగ్రెస్ కన్నా అధికంగా దోపిడి చేసిందన్నారు.  బూర్జవా పార్టీలన్నీ కూడా ప్రజలను దోపిడీ చేయడం కోసమే పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటం మొదలుకొని దేశంలో ప్రజల పక్షాన అనేక త్యాగాల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎం ది అన్నారు. డబ్బులు పంచకుండా ఏ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తూ ఈ దేశ సంపదను రాజకీయ పార్టీలు కొల్ల కోట్టి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయన్నారు. స్వతంత్ర కాలం నుండి ఈనాటి వరకు దళితులు, ఆదివాసులు ఇతర పేదల బతుకులు మారలేదన్నారు. ఖర్చు పెరిగింది, శ్రమ దోపిడీ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రజల పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టుల పార్టీల వెనుకబడ్డాయని విమర్శలు కొంతకాలం మాత్రమే ఉంటాయన్నారు. మబ్బులు కమ్మిన సూర్యుడిలా ఈ దేశంలో కమ్యూనిస్టుల పోరాటాలు నిర్వహించబడతాయన్నారు. మధ్యాహ్నం క్లాసును ఉపాధ్యాయులుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ పార్టీ నిర్మాణం పని పద్ధతి వివరించారు. మార్క్సిజం అధ్యయనం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల లెనిన్ బాబు, సత్రపల్లి సాంబశివరావు, ఉపతల నరసింహారావు, బొల్లం రాజు, నందం ఈశ్వరరావు, పిట్టల నాగమణి, పల్లపు నాగేశ్వరరావు, శాఖా కార్యదర్శులు పర్షిక పాపారావు, తాళ్లపల్లి ఉప్పలయ్య, టేకుల సత్యవతి, గనబోయిన శంకర్, కుంజా రాజు, కుంజా యుగంధర్, భూషణం, తోట పద్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !