+91 95819 05907

ఎదుర్కొనే వాడే నిజమైన కమ్యూనిస్టు

 
– పేదల రాజ్యం కోసమే సిపిఎం పార్టీ పనిచేస్తుంది
– సిపిఎం రాష్ట్ర సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు

నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి :
(అలవాల వంశీ 9052354516)

భారతదేశంలో సిపిఎం ది త్యాగాల చరిత్ర అని, కష్టాలను ఎదుర్కొన్న వాడే నిజమైన కమ్యూనిస్టు అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మణుగూరు మండలం పగిడేరు పంచాయతీలో కుంజ కృష్ణకుమారి ప్రాంగణం లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల కార్యదర్శి కొడిశాల రాములు, ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ కార్యక్రమం విశిష్టత బోధించారు. దేశంలో మూడు రాష్ట్రాలలో 9 మంది ముఖ్యమంత్రులు పనిచేశారని పేదల సంక్షేమం కోసం సంక్షేమం కోసం తప్ప ఎవరి మీద ఎలాంటి మచ్చలేదని అన్నారు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాట ఫలితాలను ప్రజలకు అందించకుండా ప్రజలను దోపిడీ గురిచేసిందన్నారు. ఈ పది సంవత్సరాల కాలంలో బిజెపి, కాంగ్రెస్ కన్నా అధికంగా దోపిడి చేసిందన్నారు.  బూర్జవా పార్టీలన్నీ కూడా ప్రజలను దోపిడీ చేయడం కోసమే పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. వీర తెలంగాణ విప్లవ పోరాటం మొదలుకొని దేశంలో ప్రజల పక్షాన అనేక త్యాగాల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎం ది అన్నారు. డబ్బులు పంచకుండా ఏ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజలను మోసం చేస్తూ ఈ దేశ సంపదను రాజకీయ పార్టీలు కొల్ల కోట్టి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాయన్నారు. స్వతంత్ర కాలం నుండి ఈనాటి వరకు దళితులు, ఆదివాసులు ఇతర పేదల బతుకులు మారలేదన్నారు. ఖర్చు పెరిగింది, శ్రమ దోపిడీ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రజల పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టుల పార్టీల వెనుకబడ్డాయని విమర్శలు కొంతకాలం మాత్రమే ఉంటాయన్నారు. మబ్బులు కమ్మిన సూర్యుడిలా ఈ దేశంలో కమ్యూనిస్టుల పోరాటాలు నిర్వహించబడతాయన్నారు. మధ్యాహ్నం క్లాసును ఉపాధ్యాయులుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ పార్టీ నిర్మాణం పని పద్ధతి వివరించారు. మార్క్సిజం అధ్యయనం ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల లెనిన్ బాబు, సత్రపల్లి సాంబశివరావు, ఉపతల నరసింహారావు, బొల్లం రాజు, నందం ఈశ్వరరావు, పిట్టల నాగమణి, పల్లపు నాగేశ్వరరావు, శాఖా కార్యదర్శులు పర్షిక పాపారావు, తాళ్లపల్లి ఉప్పలయ్య, టేకుల సత్యవతి, గనబోయిన శంకర్, కుంజా రాజు, కుంజా యుగంధర్, భూషణం, తోట పద్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !