+91 95819 05907

కారు – ద్విచక్రవాహనం ఢీ ..

– ఒకరు దుర్మరణం… ఒకరి పరిస్థితి విషమం

నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

బంధువుల ఇంట్లో కర్మలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యుఒడికి చేరగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామంలోని కిన్నెరసాని బ్రిడ్జి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన శెట్టిపల్లి నర్సింహారావు(18) తన స్నేహితుడు కణితి హర్షవర్ధన్ తో కలిసి ద్విచక్రవాహనంపై గుడిపాడు నుండి మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కర్మల కార్యక్రమంలో పాల్గొనేందుకుద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో పినపాక పట్టీనగర్లోని కిన్నెరసాని బ్రిడ్జికి చేరుకోగానే  భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న శెట్టిపల్లి నర్సింహారావు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా… స్నేహితుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ను స్థానికుల సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై సుమన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

అశ్వారావుపేట గడ్డపై గులాబీ జెండా రెపరెప.. కాంగ్రెస్ ‘గడీల’ పాలనకు కాలం చెల్లింది!

​బెదిరింపులకు భయపడం.. 13వ వార్డులో సంకుల స్వరూప గెలుపు ఏకపక్షమే: బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ గర్జన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 06: భద్రాద్రి కొత్తగూడెం

Read More »

అశ్వారావుపేటలో గులాబీ దండు ‘గర్జన’.. 14వ వార్డులో భుక్య ఉదయజ్యోతి గెలుపే లక్ష్యం!

​అమలుకాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి: జిల్లా బీఆర్ఎస్ నేత సోయం వీరభద్రం పిలుపు నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి 6: అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More »

గుండాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఓ ఎస్ డి, ఎన్,నరేందర్

** *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని

Read More »

సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలన.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో 8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్

Read More »

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే

Read More »

 Don't Miss this News !