+91 95819 05907

కారు – ద్విచక్రవాహనం ఢీ ..

– ఒకరు దుర్మరణం… ఒకరి పరిస్థితి విషమం

నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

బంధువుల ఇంట్లో కర్మలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యుఒడికి చేరగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామంలోని కిన్నెరసాని బ్రిడ్జి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన శెట్టిపల్లి నర్సింహారావు(18) తన స్నేహితుడు కణితి హర్షవర్ధన్ తో కలిసి ద్విచక్రవాహనంపై గుడిపాడు నుండి మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కర్మల కార్యక్రమంలో పాల్గొనేందుకుద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో పినపాక పట్టీనగర్లోని కిన్నెరసాని బ్రిడ్జికి చేరుకోగానే  భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న శెట్టిపల్లి నర్సింహారావు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా… స్నేహితుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ను స్థానికుల సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై సుమన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !