+91 95819 05907

కారు – ద్విచక్రవాహనం ఢీ ..

– ఒకరు దుర్మరణం… ఒకరి పరిస్థితి విషమం

నేటి గదర్, మే 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి :

బంధువుల ఇంట్లో కర్మలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యుఒడికి చేరగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టీనగర్ గ్రామంలోని కిన్నెరసాని బ్రిడ్జి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన శెట్టిపల్లి నర్సింహారావు(18) తన స్నేహితుడు కణితి హర్షవర్ధన్ తో కలిసి ద్విచక్రవాహనంపై గుడిపాడు నుండి మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో కర్మల కార్యక్రమంలో పాల్గొనేందుకుద్విచక్రవాహనంపై వెళుతున్న క్రమంలో పినపాక పట్టీనగర్లోని కిన్నెరసాని బ్రిడ్జికి చేరుకోగానే  భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న శెట్టిపల్లి నర్సింహారావు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా… స్నేహితుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ను స్థానికుల సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్సై సుమన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఏసీబీ అలజడి

వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు

Read More »

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

బండి రత్నాకర్ 20 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల కేంద్రంలోని మాజీ వైస్ ఎంపీపీ బండి రత్నాకర్ చనిపోయి నేటికి 20

Read More »

జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్ర చిన్నపిల్లలకు ఆదర్శం కావాలి.

మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు. నేటి గదర్ న్యూస్,,చింతకాని ప్రతినిధి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్ర చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని మతికేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు కోరినారు.

Read More »

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి: నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

Read More »

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది ◆ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు:మంత్రి పొంగులేటి

తెలంగాణ లో మార్పు మొదలై 23నెలలు అయింది. ఎన్నిక ఎదైనా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.. ఉంటారు.. దశాబ్దకాలం జరిగిన విద్వంసాన్ని చక్కదిద్దే కాంగ్రెస్ పైనే ప్రజల నమ్మకం. ప్రజా పాలన, సంక్షేమం, అభివృద్ధి

Read More »

నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్.

వైరా నియోజకవర్గం కేంద్రంలో పేదలకు అందని ప్రభుత్వ వైద్యం నిధులు లేక అవస్థ పడుతున్న వైరా ఏరియా ప్రభుత్వ హాస్పిటల్. వంద పడకల హాస్పిటల్ గా అఫ్ గ్రేడ్ చేసినా సరైన వైద్యం అందటం

Read More »

 Don't Miss this News !