+91 95819 05907

జూన్ 5 నుంచి భారీగా బదిలీలంటా..?

11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన…

తహసీల్దార్‌ నుంచి ఐఏఎస్‌ దాకా…

ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రాథమికం…

వివిధ ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ మే 26:
నైనారపు నాగేశ్వరరావు✍️

ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందు కోసం పాలన యంత్రాంగంలో తహసీల్దార్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాకా అన్ని స్థాయుల్లో భారీ బదిలీలకు కసరత్తు జరుగుతోందా?ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయ వర్గాలు ఔననే చెబుతున్నాయి.జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే కోడ్‌ ముగుస్తుంది. జూన్‌ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని, వరుసగా బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

“అవినీతిపై ఫోకస్‌”..!

రేవంత్‌ రెడ్డి సర్కారు అధికారంలోకి రాగానే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని బలోపేతం చేసింది.ఆ శాఖలో సమర్థులైన అధికారులతో పాటు కోర్టుల్లో కేసులు బలంగా నిలబడి,నిందితులకు శిక్షపడేలా పకడ్బందీ చార్జ్‌షీట్లు రూపొందించే సిబ్బంది, నిందితులు బెయిల్‌ పిటిషన్‌తో కోర్టులను ఆశ్రయిస్తే, శక్తిమంతమైన కౌంటర్‌ వేసే సామర్థ్యమున్న సిబ్బందిని ఏసీబీకి తీసుకొచ్చింది.దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతి అధికారులపై దాడులు పెరిగాయి.ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారుల అరెస్టులు కూడా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు మొదలు మధ్య స్థాయి అధికారులను బదిలీ చేయాలని రేవంత్‌ సర్కారు నిశ్చయించినట్లు తెలుస్తోంది.

“సుదీర్ఘ కాలం ఒకే చోట ఉన్నవారు”..

గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు బదిలీలు జరిగినా ఒకే చోట తిష్ట వేసిన వారిపై సర్కారు ఇప్పుడు దృష్టిసారించింది.కొత్త జిల్లాల విభజన సమయంలోనూ ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ కింద సర్దుబాట్లు జరిగినా కొందరు ఒకే చోట ఉండిపోయారని గుర్తించింది. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి ఒకే చోట పని చేసేవారిని బదిలీ చేయాలి.ఈ క్రమంలో ఆర్థిక,రెవెన్యూ,పోలీసు,వైద్య ఆరోగ్యం,పురపాలక-పట్టణాభివృద్ధి,వ్యవసాయం,విద్యుత్తు, పంచాయతీరాజ్‌,రోడ్లు-భవనాలు,రవాణా ఇలా అన్ని శాఖల్లో బదిలీలు చేపట్టేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఒకరిద్దరు కీలక ఐఏఎస్‌ అధికారులను,పెద్ద సంఖ్యలో ఐపీఎ్‌సలను బదిలీ చేయనున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్లు మొదలు ఎస్పీల దాకా రెవెన్యూ శాఖలో తహసీల్దార్‌ మొదలు ఆర్‌డీవో,డీఆర్‌వో,కలెక్టర్‌ వరకూ బదిలీలు ఉంటాయని స్పష్టమవుతోంది.పంచాయతీ రాజ్‌ శాఖలో ఎక్స్‌టెన్షన్‌ అధికారులతో పాటు డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్లు,జిల్లా పంచాయతీ ఆఫీసర్లు(డీపీవో), జిల్లా పరిషత్‌ చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.మరో వైపు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో కొంత మంది సబ్‌-రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు,డీఐజీలను బదిలీ చేయనుంది.ఈ శాఖలో 2023 ఆగస్టులో భారీ స్థాయిలో బదిలీ జరిగాయి.కొంత మంది సబ్‌-రిజిస్ట్రార్లు,కింది స్థాయిలో అధికారుల బదిలీలు జరగలేదు. వీరి వల్ల సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చెడ్డ పేరు వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.ఇలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని సమాచారం.వీటితో పాటు ఇంటెలిజెన్స్‌ నివేదికలు,ఉద్యోగ సంఘాల నేతలతో అంతర్గత చర్చలు జరిగిన సమయంలో సేకరించిన వివరాలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !