నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
:తెలంగాణలోకి రుతుపావనాలు ఈ సారి ముందుగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్లు బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక గురువారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఆదివారం నుంచి హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.