+91 95819 05907

మారుతి విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : MMS డిమాండ్

నేటి గదర్, జూన్ 06, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాచలం లోని ప్రైవేట్ మారుతి నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీల మరణాల పై ప్రభుత్వం స్పందించి సెట్టింగ్ జడ్జితో విచారణ ఏ విద్యార్థినికి అన్యాయం జరగకుండా భద్రత కల్పించాలని మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత మహాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మారుతి కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల మరణాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం, వేధింపుల వల్లనే విద్యార్థినీలు చనిపోతున్నరనే బలమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. విద్యార్థినీలు చనిపోతే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఆశ చూపించి డబ్బుతో మారుతి కళాశాల యాజమాన్యం మధ్యవర్తుల సహాయంతో అనారోగ్యం, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ ప్రకారం తోటి విద్యార్థులతోనే అబద్ధాలు ఆడిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతిరోజు కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివక్షత కూడిన వేధింపులు, మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆర్థికంగా, స్నేహ సంబంధాల వల్ల మారుతి కళాశాల పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యాన్ని కాపాడడం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. పగిడిపల్లి కారుణ్య మృతి, విద్యార్థుల బలవన్మరణాలకు కారణమైన కళాశాల యాజమాన్యం పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, అనుమానాస్పద మరణాల పై సిట్టింగ్ జడ్జితో పూర్తి ఎంక్వయిరీ జరిపించాలని, విద్యార్థుల మరణాలకు కళాశాల కారణమైతే మారుతి నర్సింగ్ కళాశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు, నిరసన ధర్నాలు, దిష్టి బొమ్మల దహనాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లని సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కుంచెర్ల కుమారి, కొప్పుల నాగమణి మాదిగ, ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !