+91 95819 05907

మారుతి విద్యార్థుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : MMS డిమాండ్

నేటి గదర్, జూన్ 06, భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాచలం లోని ప్రైవేట్ మారుతి నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీల మరణాల పై ప్రభుత్వం స్పందించి సెట్టింగ్ జడ్జితో విచారణ ఏ విద్యార్థినికి అన్యాయం జరగకుండా భద్రత కల్పించాలని మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత మహాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మారుతి కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల మరణాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం, వేధింపుల వల్లనే విద్యార్థినీలు చనిపోతున్నరనే బలమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్నది అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. విద్యార్థినీలు చనిపోతే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఆశ చూపించి డబ్బుతో మారుతి కళాశాల యాజమాన్యం మధ్యవర్తుల సహాయంతో అనారోగ్యం, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ ప్రకారం తోటి విద్యార్థులతోనే అబద్ధాలు ఆడిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రతిరోజు కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివక్షత కూడిన వేధింపులు, మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆర్థికంగా, స్నేహ సంబంధాల వల్ల మారుతి కళాశాల పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యాన్ని కాపాడడం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. పగిడిపల్లి కారుణ్య మృతి, విద్యార్థుల బలవన్మరణాలకు కారణమైన కళాశాల యాజమాన్యం పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని, అనుమానాస్పద మరణాల పై సిట్టింగ్ జడ్జితో పూర్తి ఎంక్వయిరీ జరిపించాలని, విద్యార్థుల మరణాలకు కళాశాల కారణమైతే మారుతి నర్సింగ్ కళాశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు, నిరసన ధర్నాలు, దిష్టి బొమ్మల దహనాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లని సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కుంచెర్ల కుమారి, కొప్పుల నాగమణి మాదిగ, ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సోషల్ మీడియాలో విద్వేషకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాము: సీఐ వెంకట రాజాగౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నాడు సీఐ వెంకట రాజాగౌడ్ విలేకర్లతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట

Read More »

భూములు కోల్పోతున్న భాధితులతో ఎంపీ రఘునందన్ రావు సమావేశం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 765 డీజీ నిర్మాణంలో భాగంగా రామాయంపేట వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై భూములు కోల్పోతున్న

Read More »

పాండ చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 19 :- బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి మహిళ శవమై కనిపించిన ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ

Read More »

JEE Mains: జేఈఈ మెయిన్స్2025 ఫలితాల్లో… సత్తా చాటిన ఆ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు.ఆ లెక్చరర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే

నేటి గదర్ ప్రతి నిధి, వైరా(గార్ల) :దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల

Read More »

తండాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం

కూసుమంచి మండలంలో వివిధ తండాలో పర్యటించిన తెలంగాణ గిరిజన సంఘం నేతలు సమస్యలపై సంబంధించిన అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు తెలిపిన భూక్యా వీరభద్రం తాగునీరు, సైడ్ డ్రైనేజ్, పక్కా ఇల్లు లేక అవస్థలు

Read More »

రాత్రి వేళలో వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించిన ఎస్ఐ

పినపాక: మండలంలోని చింతలపాడు ఆదివాసి గ్రామాన్ని ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ శనివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సన్మార్గంలో ప్రయాణించి మంచి

Read More »

 Don't Miss this News !