★MMS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు: మేకల లత మహాజన్.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి భద్రాచలం జూన్ 6:
నైనారపు నాగేశ్వరరావు ✍️
7893538668
భద్రాచలంలోని ప్రైవేట్ మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినీల మరణాలపై ప్రభుత్వం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని మరొక్క విద్యార్థినికి ఇలాంటి సంఘటనలు జరగ కుండా భద్రత కల్పించాలని మహాజన మహిళా సమైక్య (MMS) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత మహాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మారుతి కళాశాలలో చనిపోతున్న విద్యార్థుల మరణాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని,కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వేధింపుల వల్లనే విద్యార్థినీలు చనిపోతున్నరనే బలమైన వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ అధికారులు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది పలు అనుమానాలకు దారితీస్తుందని మేకల లత మహాజన్ అనుమానం వ్యక్త పరిచారు. విద్యార్థినీలు చనిపోతే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఆశ చూపించి డబ్బుతో మారుతి కళాశాల యాజమాన్యం మధ్యవర్తుల సహాయంతో అనారోగ్యం,ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ ప్రకారం తోటి విద్యార్థులతోనే అబద్ధాలు ఆడిస్తున్నారని అన్నారు.ప్రతి రోజు కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల వివక్షత కూడిన వేధింపులు,మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందని, మారుతి కళాశాలపై సంబంధించిన ప్రభుత్వ అధికారులకు ఆర్థికంగా స్నేహ సంబంధాల వల్ల మారుతి కళాశాలపై ఎటువంటి చర్యలు నేటి వరకు తీసుకోకుండా యాజమాన్యాన్ని కాపాడడం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.పగిడిపల్లి కారుణ్య మృతి మరియు విద్యార్థినిల మరణాలకు కారణమైన కళాశాల యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,అనుమానాస్పద మరణాలపై సిట్టింగ్ జడ్జితో పూర్తి ఎంక్వయిరీ జరిపించాలని, మృతులకు కారణమైన మారుతి నర్సింగ్ కళాశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు,నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లని సమ్మక్క,ఉపాధ్యక్షురాలు కుంచెర్ల కుమారి,కొప్పుల నాగమణి మాదిగ,ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు.