+91 95819 05907

ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు నిర్వహించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి :AISF

నేటి గధర్ న్యూస్ ,జూలూరుపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ముందే మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి, గుగులోత్ వంశీ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు భయానకంగా ఉన్నాయని,
తరగతు గదులలో కిటికీలకు సరైన డోర్లు లేవని అన్నారు. పాఠశాలలకు చుట్టూ మద్యం సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్నారు. నీటి కుళాయిలు విరిగి, శిథిలావస్థకు చేరిందని,చెత్తాచెదారాలతో అపరిశుభ్రంగా ఉందని, పాఠశాలలో నీటి సమస్య అతి ప్రధాన సమస్యగా ఉందని,తరగతి గదులలో ఉన్న అనేక బెంచ్ లు విరిగి, ఊడిపోయి ఉన్నాయని, తరగతి గదులలో పై పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ ను కాకుండా దీర్ఘకాలిక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జూన్ 11వరకు వేసవి సెలవులు ఉన్నందున.. వేసవి సెలవులు పూర్తయ్యే లోగా ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మత్తులను పూర్తి చేస్తే 2024 విద్య సంవత్సర విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి, అంశాల వారీగా ఎంపిక చేసి ఆయా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ పనులన్నింటినీ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే జరిగేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధుల్లో నుంచి పాఠశాలల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !