నేటి గధర్ న్యూస్ ,జూలూరుపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ముందే మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి, గుగులోత్ వంశీ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు భయానకంగా ఉన్నాయని,
తరగతు గదులలో కిటికీలకు సరైన డోర్లు లేవని అన్నారు. పాఠశాలలకు చుట్టూ మద్యం సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్నారు. నీటి కుళాయిలు విరిగి, శిథిలావస్థకు చేరిందని,చెత్తాచెదారాలతో అపరిశుభ్రంగా ఉందని, పాఠశాలలో నీటి సమస్య అతి ప్రధాన సమస్యగా ఉందని,తరగతి గదులలో ఉన్న అనేక బెంచ్ లు విరిగి, ఊడిపోయి ఉన్నాయని, తరగతి గదులలో పై పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ ను కాకుండా దీర్ఘకాలిక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జూన్ 11వరకు వేసవి సెలవులు ఉన్నందున.. వేసవి సెలవులు పూర్తయ్యే లోగా ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మత్తులను పూర్తి చేస్తే 2024 విద్య సంవత్సర విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి, అంశాల వారీగా ఎంపిక చేసి ఆయా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ పనులన్నింటినీ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే జరిగేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధుల్లో నుంచి పాఠశాలల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు..