+91 95819 05907

ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు నిర్వహించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి :AISF

నేటి గధర్ న్యూస్ ,జూలూరుపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ముందే మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి, గుగులోత్ వంశీ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రధానంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు భయానకంగా ఉన్నాయని,
తరగతు గదులలో కిటికీలకు సరైన డోర్లు లేవని అన్నారు. పాఠశాలలకు చుట్టూ మద్యం సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందన్నారు. నీటి కుళాయిలు విరిగి, శిథిలావస్థకు చేరిందని,చెత్తాచెదారాలతో అపరిశుభ్రంగా ఉందని, పాఠశాలలో నీటి సమస్య అతి ప్రధాన సమస్యగా ఉందని,తరగతి గదులలో ఉన్న అనేక బెంచ్ లు విరిగి, ఊడిపోయి ఉన్నాయని, తరగతి గదులలో పై పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ ను కాకుండా దీర్ఘకాలిక దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జూన్ 11వరకు వేసవి సెలవులు ఉన్నందున.. వేసవి సెలవులు పూర్తయ్యే లోగా ప్రభుత్వ పాఠశాలల్లో మరమ్మత్తులను పూర్తి చేస్తే 2024 విద్య సంవత్సర విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులను చేయవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను గుర్తించి, అంశాల వారీగా ఎంపిక చేసి ఆయా పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ పనులన్నింటినీ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారానే జరిగేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధుల్లో నుంచి పాఠశాలల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని కోరారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !