+91 95819 05907

వృద్ధాశ్రమంలో బియ్యం , పండ్లు,స్వీట్స్ పంపిణీ

వృద్ధాశ్రమంలో మేదరి పవన్ కుమార్ జన్మదిన వేడుకలు

బియ్యం మరియు పండ్లు,స్వీట్స్ పంపిణీ…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం/మణుగూరు జూన్ 8:

సింగరేణి ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా అధ్యక్షురాలు మేదరి పద్మ తన కుమారుడు పవన్ జన్మదిన వేడుకలు శనివారం మధ్యాహ్నం అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.వృద్ధుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వృద్ధులు పవన్ కు జన్మదిన శుభాకాంక్షలుతో పాటు ఆశీస్సులు అందజేశారు. వృద్ధాశ్రమానికి 50 కిలోల బియ్యాన్ని వృద్ధులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.స్థానిక ఓసి- 2 ,బి-రిలే డంపర్ ఆపరేటర్ జల్లా రమేష్ తన వంతు కర్తవ్యం వృద్ధాశ్రమానికి 25 కేజీల బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ,దాతల దాతృత్వాన్ని ప్రశంసించారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వృద్ధులు వృద్ధాశ్రమం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వృద్ధాశ్రమంలో 25 మంది వరకు పండుటాకులకు ఆశ్రయం కల్పించామని దాతల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతొందని సింగరేణి సేవా సమితి మరియు ఉద్యోగుల సహకారం మరువలేనిది అన్నారు,గతంలో సింగరేణి ఆధ్వర్యంలో వైద్యులు నెలకు ఒకసారి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసే వారని కరోనాతో నిలిచిపోయిన ఉచిత మెడికల్ క్యాంప్ పునరుద్ధరించాలని వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ షేహనాజ్ సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం అధ్యక్షురాలు మేదరి పద్మ, పావని సామాజిక కార్యకర్త ఏ మంగీలాల్,వెంకటేష్, వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ మెహరాజ్,భద్రం వృద్ధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !