+91 95819 05907

వృద్ధాశ్రమంలో బియ్యం , పండ్లు,స్వీట్స్ పంపిణీ

వృద్ధాశ్రమంలో మేదరి పవన్ కుమార్ జన్మదిన వేడుకలు

బియ్యం మరియు పండ్లు,స్వీట్స్ పంపిణీ…

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం/మణుగూరు జూన్ 8:

సింగరేణి ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో మణుగూరు ఏరియా అధ్యక్షురాలు మేదరి పద్మ తన కుమారుడు పవన్ జన్మదిన వేడుకలు శనివారం మధ్యాహ్నం అశ్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.వృద్ధుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వృద్ధులు పవన్ కు జన్మదిన శుభాకాంక్షలుతో పాటు ఆశీస్సులు అందజేశారు. వృద్ధాశ్రమానికి 50 కిలోల బియ్యాన్ని వృద్ధులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.స్థానిక ఓసి- 2 ,బి-రిలే డంపర్ ఆపరేటర్ జల్లా రమేష్ తన వంతు కర్తవ్యం వృద్ధాశ్రమానికి 25 కేజీల బియ్యాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా మాట్లాడుతూ,దాతల దాతృత్వాన్ని ప్రశంసించారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వృద్ధులు వృద్ధాశ్రమం నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వృద్ధాశ్రమంలో 25 మంది వరకు పండుటాకులకు ఆశ్రయం కల్పించామని దాతల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతొందని సింగరేణి సేవా సమితి మరియు ఉద్యోగుల సహకారం మరువలేనిది అన్నారు,గతంలో సింగరేణి ఆధ్వర్యంలో వైద్యులు నెలకు ఒకసారి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసే వారని కరోనాతో నిలిచిపోయిన ఉచిత మెడికల్ క్యాంప్ పునరుద్ధరించాలని వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ షేహనాజ్ సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో ఎం ఎం సి లబ్ధిదారుల సంఘం అధ్యక్షురాలు మేదరి పద్మ, పావని సామాజిక కార్యకర్త ఏ మంగీలాల్,వెంకటేష్, వృద్ధాశ్రమం నిర్వాహకులు షేక్ మెహరాజ్,భద్రం వృద్ధులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !