+91 95819 05907

ఇళ్లు… ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాదే..:మంత్రి పొంగులేటి

ఎంపీగా రామసహాయం రఘురాం రెడ్డినీ గతంలో ఎన్నడూ లేని
మెజారిటీతో గెలిపించారు..

నీకోసమే పని చేస్తా..మీకు అండగా నిలబడతా..

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేటి గదర్,జూన్ 8 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):

అర్హులైన పేదలందరికీ మొదటి విడతలో ఇళ్లు….రెండో విడతలో ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.శనివారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా నాయకన్ గూడెం, భగత్ వీడు తండా, మంగళి తండా, ఈశ్వర మదారం, రాజుపేట బజార్, రాజు పేట, గోరిలపాడు తండా, హిరామాన్ తండా, పెరిక సింగారం, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, మల్లేపల్లి, గట్టు సింగారం, గంగబండ తండా, లింగారం తండా, కోక్యా తండా, లోక్యా తండా, నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి గ్రామాలలోపర్యటించారు. పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఇన్ని సంవత్సరాల్లో ఏ సభ్యుడికి రాని మెజారిటీ రఘురాం రెడ్డి కి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్ని పరిష్కరిస్తానన్ని హామీ ఇచ్చారు. గడిచిన పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేషన్ కార్డు,ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలేరు తన సొంత ఇళ్లు కాబట్టి అక్కడి ప్రజలు ఇచ్చిన పదవితో వారందరి కోరికలు తీరుస్తానన్నారు.
రాబోయే మూడు సంవత్సరాల్లోపే పాలేరులోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన వారందరికీ తీపి కబురు అందుతుందని తెలిపారు.
ఉచిత కరెంటు కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి వాటిలో పేదలకు ఇళ్ళు నిర్మాణం చేస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి తో పాటు ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !