ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు అశ్వాపురం కిరాణా అసోసియేషన్ సభ్యులు…
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వాస్తవ్యులు పేట యాదగిరి రీమా శ్రీ కిరాణా షాప్ అశ్వాపురం,సోమవారం సాయంత్రం మణుగూరు మండలం చిక్కుడుగుంట బిటిపిఎస్ ప్లాంట్ దగ్గర బైకు,లారీ ఢీకొన్న సందర్భంగా ప్రమాదం జరగగా ఆ ప్రమాదంలో గాయపడిన పేట యాదగిరి తమ్ముడు,వారి కూతురు మరియు కుమారుడు ఇద్దరికీ కాలికి,చేతికి ప్యాక్చర్ అయ్యి ఒంటి మీద చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.ఇట్టి విషయం తెలుసుకున్న అశ్వాపురం మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు కిరాణా అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చి మనోధైర్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్కేట్ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు,కే సందీప్, డి వెంకటేష్,పి ధనంజయ,పి పుల్లారావు,నరసింహారావు, జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.









