★ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ములకలపల్లి. జులై 18.నేటిగద్దర్ న్యూస్.మండల కేంద్రం లో గల రైతు వేదిక లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్,జిల్లా నాయకుడు బత్తుల అంజి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అధ్యక్షతన తెలంగాణ సచివాలయం లో జరిగిన రైతు రుణమాఫీ 2024 నిధులు విడుదల కార్యక్రమం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం అనంతరం రైతులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి తుమ్మల, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎకకాలంలో రైతులకు రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాని దని అన్నారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ లు సున్నం సునీత, తాటి తులసి, సహాకారసంఘం సొసైటీ మాజీ అధ్యక్షులు కరుటూరి కృష్ణ, డైరెక్టర్ అనుమల సత్యనారాయణ ,మాజీ సర్పంచ్ కారం సుదీర్, సురభి రాజేష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాడి తిరుపతి రెడ్డి, పాలకుర్తి రత్నభూషణం, ఖాదరు బాబా, కొప్పుల రాంబాబు, శనగపటి రవి, కొమ్మిరాజు శ్రీను ,పాలకుర్తి రవి, కొండ్రు రవి, మిర్యాల అవినాష్, సోయం నాగరాజు తదితరులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









