నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 18:
విద్యుత్ వినియోగదారులకు సమస్యల పరిష్కారానికి రేపు అనగా 19/7/2024, శుక్రవారం రోజున సీజీఆర్ఎఫ్- 1(కన్స్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం) సమావేశం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించనున్నట్లు , విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం టీజీ ఎన్పీడీసీఎల్, చైర్ పర్సన్ ఎన్వి వేణుగోపాలచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు విద్యుత్లో వోల్టేజ్ సమస్యలు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, లోపాలున్న మీటర్లు మార్చడం, సర్వీస్ పేరు మార్చడం, క్యాటగిరి మార్చడం, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు సరిచేయడం, విద్యుత్ బిల్లులు నూతన సర్వీస్ మంజూరు తదితర వాటిని ఫోరం అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలోని తాడ్వాయి, గోవిందరావుపేట్, వెంకటాపూర్ (లక్ష్మీదేవి పేట్), ములుగు మండలాల విద్యుత్ వినియోగదారులు ఉదయం 10:30 మధ్యాహ్నం 1:00 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.









