+91 95819 05907

రామాయంపేట పట్టణంలో రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ నాయకుల సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 18:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ మొదటి విడతలో లక్ష రూపాయలు మాఫీ చేయడం పట్ల రెండో విడత లక్ష రూపాయల మాఫీ ఆగస్టు 15లోగా రైతులకు ఇచ్చిన మాటతో గురువారం రోజు రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదిక నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ బస్టాండ్ మీదుగా సిద్దిపేట చౌరస్తా నుండి మెదక్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్, కార్యదర్శి సుప్రభాత రావు లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తెలపడానికి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు..రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు.గత ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ చేయడానికి మాట ఇచ్చి ఐదు సంవత్సరాలుగా లక్ష రూపాయలను వడ్డీలతో పెంచి మళ్లీ వసూలు చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైందన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమ కోసం పనిచేస్తూ ఇక ముందు చాలా కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి,విప్లవ కుమార్,వినయ్ సాగర్ బైరం కుమార్, సుంకోజు దామోదర్, నెహ్రూ నాయక్,చింతల సాయిలు, విరాట్ నరేష్,ఎర్రం సత్యం, తొంటవాలి యాదగిరి,శంకరయ్య సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !