నేటి గదర్ న్యూస్, నవంబర్ 20మణుగూరు టౌన్: మణుగూరు మండలం లోని అటవీ ప్రాంతంలో ఉన్న రేగులగండి చెరువు ను, రాయి గూడెం నుంచి పర్ణశాల వరకు బోటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు పినపాక యం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారికి ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా కూనవరం 2 మాజీ యం పి టి సి, ఎం పి టి సి ల ఫోరమ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు మాట్లాడుతూ అశ్వాపురం లో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్, మణుగూరు లో ఉన్న సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశ్రమలు పరంగా అభివృద్ధి చెందిన, పర్యాటక రంగంలో వెనుక బడినం అనే ఉద్దేశం తో పినపాక ఎం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారు ప్రత్యేక చొరవ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులుభట్టివిక్రమార్కగారు పొంగులేటి. శ్రీనివాస రెడ్డి గారు, తుమ్మల. నాగేశ్వరావు గార్ల సహకారం తో రేగుల గండి చెరువులో బోటు షికారు,రాయి గూడెం నుంచి పర్ణశాల వరకు బోటుషికారు ఏర్పాటు కు ప్రయత్నం చేయడం చాలా సంతోషకరం అని, వారం, నెల చివరలో కుటుంబం తో ఈ ప్రాంత ప్రజలుఎంజాయ్చేయటం,పర్ణశాల కు వెళ్లి దేవుడు దర్శనం చేసుకోవడం, ఆహ్లాదకరమైన వాతావరణం లో ఆనందంగా గటపటం పర్యాటక రంగలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందు తుందని గుడిపూడి. కోటే శ్వరరావు అన్నారు. పర్యాటక రంగం లో మణుగూరు మండలం ను ముందుకు తీసుకువెళుతున్న పినపాక యం యల్ ఏ శ్రీ పాయం. వెంకటేశ్వర్లు గారికి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క గారికి, పొంగులేటి. శ్రీనివాస రెడ్డి గారికి, తుమ్మల. నాగేశ్వరావు గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలుతెలుపుకుంటున్నామని అని అన్నారు.









