ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్.
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ ధన్సింగ్ కు మెమోరండం ఇచ్చిన బిజెపి మండల నాయకులు పూర్తి వివరాల్లోకి వెళితే బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మరియు ప్రజలను నిట్ట నిలువునా ముంచిందని భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వడం ఏ కాకుండా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇంకా పెన్షన్ 4000 ఇస్తామని అలాగే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జాప్యం చేయడమే కాకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేదంటే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివకుమార్ గౌడ్ , కార్యదర్శి సాయి తేజ, భూత్ అధ్యక్షులు రవి, మరియు సీనియర్ నాయకులు ముక్కా యాదగిరి , భిక్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.








