+91 95819 05907

ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో జిల్లా మంత్రులు శ్రద్ధ వహించాలి:పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నామాల ఆజాద్

■ పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నామాల ఆజాద్

★ఖమ్మం నగర ముఖ్యుల సమావేశం

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :

ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శ్రద్ధ వహించాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ తెలిపారు.స్థానిక రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పి డి ఎస్ యు నగర ముఖ్యుల సమావేశంలో వారు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నటువంటి యూనివర్సిటీ సమస్యను కనీసం అసెంబ్లీలో గాని క్యాబినెట్ సమావేశంలో కానీ మాట్లాడకపోవడం జిల్లా ప్రజానీకాన్ని నిర్లక్ష్యం వహించడమేనన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఇంకా జిల్లా లో JNTU మెడికల్ కాలేజీ నిర్మాణంలో నిర్వీర్యం అవుతున్న పరిస్థితి ఉన్న జిల్లా మంత్రులు స్పందించి క పోవడం ఏమిటని వారిని ప్రశ్నించారు. గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అద్దె భవనాల్లో నడుస్తూ హత్యలు చెల్లించకపోవడం వల్ల గురుకులాలకు తాళాలు వేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది అన్నారు. గురుకులాలలో చదివే విద్యార్థులు అద్దె భవనాలలో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఏలుకలు కరిచి ఆసుపత్రుల పాలైన కనీసం మంత్రులు పరామర్శించినటువంటి దాఖలాలు లేకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే జిల్లాకు నిధుల కేటాయించి సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో జిల్లా విద్యారంగ సమస్యలతో పాటు యూనివర్సిటీ సాధన కోసం కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో పీడీ ఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్, జిల్లా నాయకులు వినయ్, పృథ్వి, సాదిక్, సందీప్, అశోక్, నసీర్, వరుణ్, మణికంఠ, రూత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !