+91 95819 05907

చిరుమళ్ళ సమ్మక్క సారలమ్మ జాతర లో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: ఐటీడీఏ పీవో బి. రాహుల్

నేటి గదర్ న్యూస్, కరకగూడెం:
గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకొని సమ్మక్క సారలమ్మ జాతరకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతర అయిపోయే వరకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు తన చాంబర్లో వచ్చే నెలలో కరకగూడెం మండలం చిరుమల్లలో ఆదివాసి గిరిజనులు సాంప్రదాయపద్ధంగా జరుపుకునే సమ్మక్క సారక్క జాతరకు వచ్చే ప్రత్యేక పూజారుల కుటుంబాలకు మరియు భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆ గ్రామం గిరిజనులు కోరినందున అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులకు సూచించారు. జాతర జరిగే సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి పరిసరాల చుట్టూ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, శానిటేషన్, మంచినీటి సౌకర్యం, భక్తులు సేద తీరడానికి టెంట్లు, స్త్రీలు బట్టలు మార్చుకొవడానికి తాత్కాలిక శిబిరం ఎంపీడీవో మరియు గ్రామపంచాయతీ ఈవో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూసుకోవాలని, దేవస్థానం కమిటీ వారి సూచనలు ప్రకారము గద్దెల చుట్టూ ఫ్లోరింగు మరియు రిపేర్లు పెయింటింగులు ఐటీడీఏ డి ఈ ,ఏ ఈ లు తగు ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే పార్కింగ్ ప్లేస్ & బందోబస్తు పోలీస్ శాఖ వారు చూసుకోవాలని, వైద్యశాఖ తరఫున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, టెంపరరీ టాయిలెట్లు మరియు స్నానాలకు షవర్ బాత్ లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. శానిటేషన్ మరియు మంచినీటి సౌకర్యం చాలా కట్టుదిట్టంగా చేయాలని, వైద్యశాఖ తరఫున అన్ని రకాల మందులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. వారం రోజులు జరిగే ఈ జాతర అధికారులందరూ సమన్వయంతో ఉండి విజయవంతంగా జరిగేటట్లు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీడీవో దేవర ప్రసాద్, విద్యుత్ శాఖ ఏడి వేణు, డి ఈ మధుకర్, ఏఈ యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !