– నూతన అధ్యక్షులుగా బండారు నరేంద్ర
పినపాక
పినపాక మండలం సీతoపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన ఆలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుదవారం దేవస్థానంలో సమావేశమైన సభ్యులు తొలుత పలు అభివృద్ధి అంశాలపై , శివరాత్రి మహోత్సవం గురించి చర్చించారు. అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులుగా బండారు నరేంద్ర, కొండేరు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా అరే శంకరయ్య , ప్రధాన కార్యదర్శి గా బండారు రామ చందర్ రావు, కోశాధికారిగా అరే లెనిన్ ప్రసాద్, కొండేరు కృష్ణ మూర్తి తో పాటు16 మంది సభ్యులుతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు బండారు నరేంద్ర, కొండేరు వెంకటేశ్వర్లు సంయుక్తంగా మాట్లాడుతూ రాబోయే శివరాత్రి మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా , ప్రజలకు ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు. ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజ రాజేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు