+91 95819 05907

ఓటు హక్కు – ప్రజాస్వామిక హక్కు :తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్పర్సన్ జీవి వెన్నెల

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, సతీష్ కుమార్ జినుగు.

ఓటు హక్కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆయుధం. ఓటుతో నీ విలువ పెంచుకోవచ్చును. పైసలకు, కులానికి, మత్తుకు, ఓటును బలిచేయవద్దని చైర్మన్ తెలంగాణ సాంస్కృతిక సారథి జీవి వెన్నెల అన్నారు. గురువారం ఖమ్మం వైరా రోడ్డు వేదిక కన్వెన్షన్ హాల్లో రచయిత కవి గాయకులు యశ్ పాల్ అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటు విలువ దాని ప్రాధాన్యత అనే అంశంపై సదస్సు జరిగినది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జీవి వెన్నెల మాట్లాడుతూ విద్యావంతులకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

చదువురాని పామరులు ఓటును చక్కగా వినియోగించుకుంటారని విద్యావంతులే కొంత జాప్టన్ చేస్తూ పాల్గొటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. విద్యావంతులు ఇతరులకు ఆదర్శవంతులుగా ముందు ఉండాలని విజ్ఞప్తి చేశారు. సారధి కళాకారులకు ఓటు హక్కు పై ప్రచారం చేయమని ఆదేశించారు.సారధి కళాకారులు, రచయిత యశ్ పాలు మాట్లాడుతూ ఖమ్మం భద్రాచలం జిల్లాలో ప్రచారం చేస్తున్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లు తప్పకుండా ఓటు హాల్ వరకు వచ్చేలా చూడాలని అందుకు ఆటపాట ద్వారా ప్రచారం విచిత్రంగా చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కవి రచయిత దేవేంద్ర, సుబ్రమణ్య కుమార్ ( ఖమ్మం కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ), జీవన్( విరసం ఆవిర్భావ సభ్యులు), ఖమ్మం కళాపరిషత్ నాగబత్తిని రవి, సాంస్కృతిక సేన చక్రాల రఘు, కానుగుల రాధాకృష్ణ. జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు పోలూరు రాము, పుల్లారావు, సారధి కళాకారులు మిమిక్రీ సుధాకర్, కాల్వకట్ల జాన్, పాగి వెంకన్న, బొమ్మెర ముత్యం, నకిరికంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి

నేటి గదర్ వెబ్ డెస్క్: *తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..* ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ

Read More »

 Don't Miss this News !