.
ఇందిర పార్క్ వద్ద మహా ధర్నా జయప్రదం చేయండి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు.
నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి
ఏన్కూరు:- కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగం తోపాటు విద్య, ఆరోగ్య సంక్షేమ రంగాలకు నిధులు కేటాయింపులు పెంచాలి అని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ ఇందిర పార్క్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే మహా ధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
ఆదివారం ఏన్కూరు ప్రజా సంఘాల కార్యాలయం లో దొంతి బోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఎలాంటి అలోచన చేయలేదు అన్నారు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు
గిట్టుబాటు ధరల చట్టబద్ధత, దేశవ్యాప్త రైతు రుణమాఫీ కోసం గత ఐదు సంవత్సరాలుగా రైతులు అనేక రూపాల్లో ఉద్యమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు, మరో వైపు ఎరువులు సబ్సిడీ,పంట భీమా పధకాల కు కోత పెట్టి కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ప్రోత్సాహకాలు అందించేందుకు బడ్జెట్లో సానుకూల దృక్పథం కనిపిస్తుంది అన్నారు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు విద్య ఆరోగ్య రంగాలకు 10 శాతం నిధులు కేటాయింపులు చేయాలని కోరారు కేంద్ర బడ్జెట్ సవరణలు కోరుతూ మహా ధర్నా జయప్రదం కోరారు ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా లక్ష్మా, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇటికాల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.









