+91 95819 05907

కల్వకుంటలో మల్లికార్జున స్వామి 33వ జాతర వార్షికోత్సవాలు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) ఫిబ్రవరి 10:- మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గొల్ల కుర్మ యాదవుల ఆరాధ్య దైవం అయినటువంటి మల్లికార్జున స్వామి 33వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ మల్లన్న స్వామిని స్మరించుకుంటూ ప్రతి ఏటా మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు.ఉత్సవాలలో భాగంగా మల్లన్న స్వామి కళ్యాణం,గంపల ఊరేగింపు,అగ్నిగుండాల తొక్కుట కార్యక్రమం చేపట్టామన్నారు.అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు.ఆ మల్లికార్జున స్వామివారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. సాయంకాల సమయంలో బండ్లు తిరుగుట కార్యక్రమం చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు పాతింటి మల్లయ్య, బక్కనోళ్ల ఎల్లయ్య,నేరెళ్ల ఎల్లయ్య,గుర్రం యాదయ్య, ముష్టి శ్రీశైలం,ముష్టి మురళి యాదవ్,బస కొమురయ్య,నేరోళ్ల కిష్టయ్య,నేరోళ్ల రమేష్,బస కుమార్,బక్కనోళ్ల బాలరాజ్ యాదవ్,గురం శంకర్,బక్కనోళ్ల కుమార్ యాదవ్,ముష్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !