+91 95819 05907

దండకారణ్యంలో ఎన్కౌంటర్ లను ఆపాలి

◆మావోయిస్టు లతో చర్చలు జరపాలి*

◆ఇరు దేశాల మధ్య చర్చలతో హింసకు స్వస్తిపలుకు తున్నప్పుడు తమ దేశ పొరులతో చర్చలు చేస్తే తప్పేంటి?*

◆తెలుగు బిడ్డలను పిట్టల్లా కాల్చుతుంటే రెండు ప్రభుత్వాలు పట్టించుకోవా?*

◆మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్.

నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:

దండకారణ్యంలో కొన్ని నెలలుగా సాగుతున్న మారణకాండ ఆగాలంటే చర్చలే పరిష్కారం అని సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు. ఆయుధాలతో సంచరిస్తున్నారనే నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలు తీసేహక్కు పోలీస్ బలగాలకు లేదన్నారు. విదేశీ శక్తులు దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వారి జాడనునుకనిపెట్టి వారిపై దాడికి ప్రయోగించే డ్రోన్ లను శాటిలైట్ గన్ , రోబో డేగలను మన పొరుల మీదే ఉపయోగించడం, దారుణంగా మట్టుబెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రెండు నెలల్లోనే వందల మంది ఎన్కౌంటర్ లో చనిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ గా 25 ఏళ్ళు పనిచేసిన మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ లో, నక్సల్స్ వార్తల సేకరణలో బాగా అనుభవం ఉండి గతంలో నక్సల్స్ తో చర్చల సమయంలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన అనుభవంతో మీడియాతో తన అభిప్రాయాలను పంచున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నక్సల్స్ ని నిర్మూలించేకంటే అదే టెక్నాలజీ ఉపయోగించి దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించాలని అదే టెక్నాలజీ ఉపయోగించి దేశ సంపద దోచుకుంటున్న వారిని, ప్రజలను దోచుకుంటున్న వారిని నిర్మూలించాలని అలా చేస్తే భవిష్యత్తు లో నక్సలైట్ల ఉనికి ఉండకపోవచ్చు కదా అని ఆయన అన్నారు. సమస్య మూలాల ను పరిష్కరించే బాద్యతను వదిలి విచక్షణారహితంగా కాల్పులు జరిపి చనిపోయిన వారి శవాలను ఇలా కుప్పలుకుప్పలుగా పంపించడం అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఈ మారణకాండలో వేలాది మంది అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్టు వార్తల్లో చూస్తున్నాం అందుకే మావోయిస్టు లను చర్చలకు పిలవాలని ఈ నరమేధానికి ముగింపు పలకాలని క్రాంతి కిరణ్ కోరారు. దేశాల మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది చనియేయినప్పటికి ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు చర్చల ద్వారా కాల్పుల విరమణ చేసి హింసకు స్వస్తిపలుకుతున్న పరిస్థితి మన కళ్లముందర కనిపిస్తున్న తరుణంలో తమ దేశ బిడ్డలతో చర్చలు జరపడానికి మన ప్రభుత్వాలు ఎందుకు ముందుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చొరవ చూపి కాల్పుల విరమణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !