నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం : పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల డబ్బు ఆత్మగౌరవ మహాప్రదర్శన పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డబ్బు మహా ప్రదర్శన చేయటం జరిగింది . ఈ ప్రదర్శనలో ఎమ్మార్పీఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు బాకీ శ్రీను మాదిగ మాట్లాడుతూ షమీమ్ అక్తర్ నివేదికలో లోపాలను సవరించాలని , మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని , వర్గీకరణ మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు ఏ బి సి డి గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి కోరారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ , ఎం.ఎస్.పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తురుగంటి అంజయ్య మాదిగ , రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ , రాష్ట్ర నాయకులు ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ , ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు సుర పెళ్లి నాగేశ్వరరావు మాదిగ , టౌన్ నాయకులు తంబర్ల వెంకట కర్ణ మాదిగ , టౌన్ నాయకులు బండి రవి మాదిగ , డివిజన్ అధ్యక్షులు సూరపల్లి వెంకటరత్నం మాదిగ , డివిజన్ అధ్యక్షులు బలంతు యేసు మాదిగ మరియు జిల్లా , మండల , గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
