+91 95819 05907

2030 కల్లా లింగ సమానత్వాన్ని సాధించాలి… సిడబ్ల్యుసి చైర్ పర్సన్ భారతరాణి.

ఖమ్మం :నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి.మార్చ్ 7:- ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన లింగ సమానత్వం- 2030 నిజం చేయాలంటే మనమందరం ఐక్యంగా కృషి చేయాలని బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి భారతరాణి మహిళా లోకానికి పిలుపునిచ్చారు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం ( మార్చ్ 8) సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ( ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టేకులపల్లి లోని గల మహిళా ప్రాంగణం నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జెండర్ ఈక్వాలిటీ స్ట్రాటజీ 2022 2025 పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక క్రింది క్షేత్రస్థాయి వరకు చేరినప్పుడే మహిళా సాధికారత లింగ సమానత్వం అనే లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు ఇప్పటికీ నాయకత్వంలో మహిళల కొరత ఉందని అన్నారు
పార్లమెంట్ స్థానిక సంస్థలు మేనేజ్మెంట్ పదవుల్లో కేవలం 27 నుంచి 36% మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు
పేదరికం పని ప్రాంతం వివక్షత అసమానతలు అసమతుల్యత సామాజిక కట్టుబాట్లు సాంస్కృతిక ఆచారాలు విద్యా ఆరోగ్యం ఆహార భద్రత గృహహింస వీటికి తోడుగా నిధుల కొరత ఆడపిల్లలు మహిళల కోసం అమలు చేయని చట్టాలు ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా మారాయని వీటన్నిటిని అధిగమించి 20 30 లక్ష్యాలను చేరుకోవడానికి సమిష్టి కృషి నిధుల పెంపుదల అవసరం ఎంతైనా ఉంది అని ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు కలిసి అడుగు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు
మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ వేల్పుల విజేత మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మహిళా ప్రాంగణం నందు మహిళల కోసం యువతల కోసం అనేక రకాల కార్యక్రమాలను ట్రైనింగ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయూతనందిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపారు వీలు కుదిరినప్పుడల్లా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు లింగ సమానత్వం గురించి స్త్రీ సాధికారిక స్త్రీ కోసం పాటుపడిన మహిళా మణులను ఎందరినో స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో రాణించి పదవురికి ఆదర్శంగా నిలిచేలా పూర్తినిస్తున్నట్లు తెలిపారు
పోలీస్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బాధ్యులు నరసింహారావు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళా సహాయ కేంద్రాలు షీ టీమ్స్ భరోసా డయల్ 100 ల ద్వారా నిరంతరం రక్షణ కల్పిస్తూ మేమున్నాం అనే భరోసాని ఇస్తున్నట్లు తెలిపారు
సెల్ఫోన్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గృహహింస కూడా అక్రమ రవాణాకు ఒక కారణంగా మారుతుందని తెలిపారు అక్రమ రవాణా దారులు మహిళలు చిన్నపిల్లలు యువతను లక్ష్యంగా చేసుకొని అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి వారి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తారని కావున తెలిసిన తెలియని వ్యక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు
ఎయిడ్ సంస్థ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ మనదేశంలో ప్రతి రెండు నిమిషాలకు ఒక బాల్య వివాహం జరుగుతుందని 2030 కల్లా బాల్య వివాహ ముక్తు భారత్ లక్ష్యంగా జిల్లాలో అనుబంధ శాఖ అధికారుల సహాయ సహాయ సహకారాలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . బాల్య వివాహాలను రూపుమాపినప్పుడే స్త్రీ సాధికారిక మరియు లింగ సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు
బాలలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు
అనంతరం మహిళా సాధికారతకు సంబంధించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ గోడ పత్రికను అతిథులు అందరి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్స్ కే శ్రీనివాస్ వి రాజేష్ టీం సభ్యులు మాధవి రాందాస్ కుటుంబరావు మరియు మహిళా ప్రాంగణం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

రుణమాఫీ చేసినందుకు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, రైతులు

నేటి గదర్ న్యూస్, మార్చి 13, ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాల రావు, సెల్ ; 9502921891 ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు ప్రజా ప్రభుత్వం ముఖ్యమం ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన

Read More »

గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన దేశినేనిపాలెం గ్రామవాసి

*శుభాకాంక్షలు తెలియజేసిన దేశనేనిపాలెం గ్రామ ప్రజలు…* 💐💐💐 గ్రూప్ -2 విజయం సాధించిన దేశీనేనిపాలెం గ్రామవాసి నేటి గదర్ న్యూస్, మార్చి 13, సగ్గుర్తి ముత్యాల రావు మధిర మండలం దేశినేనిపాలెం గ్రామానికి చెందిన

Read More »

3వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

నిరంతరంగా మూడోరోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన ఎం.ఎఫ్ నాయకులు పార్శపు ఏనూక మాదిగ నేటి గదర్ న్యూస్, మార్చి 13. మధిర కేంద్రం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మహాజననేత

Read More »

ఆ వలస ఆదివాసి గ్రామంలో టీవీ యాంకర్లు సందడి చేశారు.మన గ్రోమోర్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం

నేటి గదర్ న్యూస్,పినపాక: మండలంలోని గ్రామపంచాయతీ లోని తిల్లాపురం ఆదివాసి గ్రామంలో బిగ్ ఫేమస్ ఆర్టిస్టులు గీత రాయల్ శ్రీ సత్య పవిత్ర యాంకర్ అనిల్ జిలా గురువారం పర్యటించారు. మన గ్రోమోర్ ఆధ్వర్యంలో

Read More »

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

 Don't Miss this News !