+91 95819 05907

ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి -ఎమ్మెల్యే జారే

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 08: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియచేశారు, మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్రబిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి, సావిత్రీబాయి ఫూలే, ఇందిరాగాంధీ లాంటి అనేకమంది తమ ప్రతిభతో ధైర్యసాహసాలతో అంకితభావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు
మహిళలకు సమాన అవకాశాలు అందిస్తూ ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళల భద్రతను పరిరక్షిస్తూ మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈసందర్భంగా తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల మహిళా కమిటీ సభ్యులను గ్రామ మహిళా కమిటీ సభ్యులను మహిళా ఉద్యోగులు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, పణి, బాబి, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించిన మాజీ మంత్రి జలగం ప్రసాద్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు గురువారం అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం సమీపంలో గల గంగానమ్మ ఆలయం ప్రాంగణంలో స్థానిక

Read More »

భారత వాయుసేన అమ్ములపొద లోకి మరో ‘అస్త్రం’

భారత వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం చేరనుంది. గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ ‘అస్త్ర’ క్షిపణి(BVRAAM)ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ (ADA) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ తీరంలో తేజస్

Read More »

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట బిఆర్ఎస్ శ్రేణులు గురువారం అశ్వారావుపేట

Read More »

నీ కంటి దానం… రెండు అంధ జీవితలకు వెలుగు….

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, జినుగు సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, దుద్దెపూడి గ్రామం అమర్లపూడి పుల్లయ్య (58) నిన్న ఉదయం గుర్తు తెలియని వాహనం వైరా

Read More »

ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు:ఎంపీడీఓ సునీల్ కుమార్

★భూగర్భ జలాల పెంపును ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి ★ఎంపీడీవో సునీల్ కుమార్ నేటి గదర్ న్యూస్,పినపాక:ఇంకుడు గుంతలు… భూగర్భ జల బండాగారాలు అని పినపాక మండల ఎంపిడీఓ సునీల్ కుమార్ అన్నారు.

Read More »

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

 Don't Miss this News !