+91 95819 05907

ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి -ఎమ్మెల్యే జారే

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 08: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు వేడుకలకు మాత్రమే పరిమితం కాదని మహిళల హక్కులను గుర్తిస్తూ వారు సాధించిన విజయాలను తెలియచేశారు, మహిళలు ఎంతో మార్పు చెందిన ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ అభివృద్ధికి తమ పాత్ర పోషిస్తూ కేంద్రబిందువులుగా నిలుస్తున్నారన్నారు. చరిత్రను పరిశీలిస్తే రాణి రుద్రమదేవి, సావిత్రీబాయి ఫూలే, ఇందిరాగాంధీ లాంటి అనేకమంది తమ ప్రతిభతో ధైర్యసాహసాలతో అంకితభావంతో ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి కోసం వారు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అవ్వడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని తెలిపారు
మహిళలకు సమాన అవకాశాలు అందిస్తూ ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మహిళల భద్రతను పరిరక్షిస్తూ మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా జీవించే సమాజాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈసందర్భంగా తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల మహిళా కమిటీ సభ్యులను గ్రామ మహిళా కమిటీ సభ్యులను మహిళా ఉద్యోగులు ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, పణి, బాబి, నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అల్లు సతీష్‌ రెడ్డికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

నేటి గదర్ న్యూస్, పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్యకర్త అల్లు సతీష్‌ రెడ్డి ఇటీవల మరణించగా అతని దశదిన కార్యక్రమం గురువారం జరగింది. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ

Read More »

మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, యం ఎల్ సి, జాగృతి వ్యవస్థాపకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్

Read More »

మానవత్వాన్ని చాటుకున్న బీటీపీఎస్ సీ ఈ బిచ్చన్న, ఉద్యోగులు

– చిన్నారి కొమరం లాస్యశ్రీ కు బాసటగా బీ టీ పీ ఎస్. – సీ ఈ బిచ్చన్న రూ 10 వేలు ఆర్ధిక సాయం. – లాస్య శ్రీ ఆరోగ్యం, ఉన్నత చదువులకయ్యే

Read More »

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరువుకోవాలి: ఎస్సై

మండల ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో , సంప్రదాయ రంగులను ఉపయోగించి సురక్షితంగా జరుపుకోవాలి -శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు -ఎదుటివారికి ఇబ్బంది కల్గించవద్దు

Read More »

ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : బీ ఆర్ ఎస్

-. -భూ సేకరణ అధికారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ శ్రేణులు మణుగూరు మార్చి 13 : మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని

Read More »

DSFI (డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ సభ ను జయప్రదం చేయండి

◆ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యుడు కుర్ర రంగా నాయక్ నాని *ప్రకాశం జిల్లా 13/03/2025 గురువారం…!* *తెలంగాణలో* జరుగుతున్న భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య *(DSFI)* ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని *తెలంగాణ రాష్ట్ర నాయకుడు

Read More »

 Don't Miss this News !