★ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పై తాతా మధు చేసిన అహంకార పూర్తి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
★టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ కనుబుద్ధి దేవా
★ఊడిగం చేయాలనుకుంటే ధోరగడీలలో చేసుకోవాలి తప్ప ప్రజాస్వామ్యంలో కుదరదంటూ హెచ్చరిక
★కాంగ్రెస్ పార్టీ జోలికివస్తే చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ వ్యాఖ్య
నేటి గదర్ న్యూస్,చింతకాని:
తెలంగాణరాష్ట్ర దళిత ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని అసభ్యపదజాలం వాడుతూ సిగ్గు లజ్జ ఉందా అనేలా అహంపూరిత వ్యాఖ్యలు చేసిన BRS పార్టీ ఎమ్మెల్సీ తాత మధు మాటలు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
– *కమిషన్లకు కేరాఫ్ అడ్రస్ కారు పార్టీనేనని*
– *భూకుంభకోణాలు*
– *పథకాల పేరిట వందలకోట్ల దోపిడీ*
– *వ్యవసాయక్షేత్రాలు,ఫార్మహౌజ్ నిర్మాణాలు*
– *విదేశాల్లో విల్లాలు-ఖరీదైన బంగ్లాలు*
– *లిక్కర్ వ్యాపారాలు*
– *కార్ రేస్లు గొర్రెలు కుంభకోణాలు దగ్గర నుంచి కాళేశ్వరం దాకా కమీషన్లు*
*తీసుకొని కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన ఘనత మీ దొరల పాలనకే చెందుతుందని, దొరలరాజ్యంపై మమకారం ఉంటే సాగిలపడి పొర్లుదండాలు పెట్టాలిగాని, రూపాయి రూపాయి పోగేసి ప్రజాసంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అందిస్తున్న ప్రజాప్రభుత్వంలోని నాయకులపై ఇష్టానుసారంగా నిరాధార ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం లేక బిజెపితో చీకటి ఒప్పందం పెట్టుకుని బిజెపికి ఊడిగం చేసిన చరిత్ర మీదని, ఆఖరికి మీ పాలనలో గ్రామ సర్పంచులే ఆత్మహత్యలు చేసుకున్న నీచాతినీచమైన రోజులు ప్రజలు మరవలేదని, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత తమరికి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న భట్టి విక్రమార్క గారు ఎంతో బాధ్యతతో అహర్నిశలు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న విధానాలను చూసి ఓర్చుకోలేకనే అవాకులుచెవాకులు పేలుతున్నావని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ఉమ్మడి ఖమ్మం ప్రజానీకం మరియు కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని రెట్టింపు సత్కారాలు చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది*