+91 95819 05907

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి

◆ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపడుకుంటా

◆స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి

-మాజీ ఎమ్మెల్యే మెచ్చా

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట మండలం మామిళ్ళవారిగూడెం గ్రామంలో కనకం కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం వనపర్తి మోహన్ రావు నివాసంలో స్థానిక ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని. అధికారంలోకి రావాలనే ఆశతో అడ్డగోలుగా హామీలిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక హామీలను గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారని, ఏ క్షణం ఎవరి సీటు పోతుందో అనే భయంతో ప్రజలను, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతి ఒకరు దోచుకునే, దాచుకునే పనిలో ఉన్నారని, ప్రజల్లో వ్యతిరేకత ఉనందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సైతం వెనకడుగు వేస్తున్నారని. రాబోయే రోజుల్లో ఏ నిమిషమైన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక తప్పదని, ఆ సమయంలో నాయకులు, కార్యకర్తలు అందరు సమన్వయంతో పని చేస్తూ ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని వివరించాలని. నేడు కష్టంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అదే స్థాయిలో గౌరవం దక్కే విధంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జూరి వెంకన్న బాబు, మోహన్ రెడ్డి, చిన్న సత్యనారాయణ, తాండ్ర యుగంధర్, కూరపాటి నరేష్, మిండ శ్రీనివాస్ రావు, కొర్సా ప్రతాప్, పొట్టా రాము, వనం బాబురావు, యాసం శ్రీను, తాటి వెంకప్ప, సింగీరాల నాగేంద్ర, రత్కకర్, కొనకళ్ళ శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !