+91 95819 05907

ముస్లింల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా : రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం మార్చి 16 : ముస్లిం మైనార్టీల  సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జోలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు  తెలిపారు. శనివారం సాయంత్రం మదర్సే ఇస్లామియా దారుల్ ఊలుమ్ లో జమీయత్ ఉలేమా ఏ హింద్ జిల్లా అధ్యక్షులు , మదర్సా కరస్పాండెంట్ మౌలానా మహమ్మద్ సయీద్ అహ్మద్ ఖా ష్మీ  అధ్యక్షతన జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకు ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది , ఫలితంగా అవసరాలు పెరుగుతున్నాయి . ఈ క్రమంలోనే ముస్లిం మైనార్టీలు అత్యధిక మంది కొత్త షాదీ ఖానాలు, కొత్తగా ఖబర్ స్తాన్లా ఏర్పాటుకు తన దగ్గర ప్రస్తావిస్తున్నారని , వీటి గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తాను ఈ సమస్యలను తీసుకుని వెళ్లానని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో రెండు షాదీఖానాల నిర్మాణానికి మీరు ఎక్కడ కోరిక అక్కడ నిర్మించడానికి సిద్ధమన్నారు. నేనెవరో తెలియని దశలో నన్ను మీరంతా మద్దతు పలికి , గెలిపించారని , ఈ రుణం తీర్చుకోలేని దని అన్నారు. తన విజయంలో ముస్లింల పాత్ర  ఎంతో ఉందని తెలిపారు.కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ పూరిత వాతావరణంతో ఖమ్మం జిల్లా ఉందని , ఇది ఇలాగే ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్ష అంటూ ముస్లిం పెద్దలు మంత్రి ద్వారా చెప్పిన సమస్యల పై ఈ రంజాన్ మాసంలోనే మరో రెండు వారాలలో  కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్  సునీల్ దత్ మాట్లాడుతూ ఎలాంటి కలహాలు లేకుండా శాంతియూత వాతావరణంలో ఖమ్మం జిల్లా ప్రజానీకం జీవిస్తున్నారని , ఇది మంచి సాంప్రదాయం అంటూ కితాబు ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !