★ ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి
నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్:
2024_25ఆర్థిక సంవత్సరానికి గాను ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 127.60 వేల టన్నుల సాధనలో ప్రకృతి పరంగా అనేక ప్రతి కూల వాతావరణాలు ఎదురైనప్పటికీ వాటిని అనుకూల పరిస్థితులుగా మలచుకొని సమష్టి కృషితో పూర్తి లక్ష్యాన్ని సాధించి మణుగూరు ఏరియా రికార్డ్ ను పదిల పరచడం అభినందనీయమైన అంశమని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు తెలిపారు. నిర్దేశించిన ఉత్పత్తి ఉత్పాదకత లక్ష్యాల కోసం కష్టించి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు.గడిచిన ఐదు దశబ్దాలకు పైగా మణుగూరు ఏరియా కోల్ బెల్ట్ నందు ఎన్నడు కురువని వర్షాలు గడిచిన ఆగస్ట్ మాసం లో కురిసి ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడినప్పటికీ మైనింగ్ రంగంలో విశేష అపార అనుభవం కలిగి ఉన్న ఏరియా జి యం దుర్గం రామ చందర్ పక్కా ప్రణాళికలు రచించి దీక్ష దక్షత, పట్టుదల,అంకుటిత భావం ప్రదర్శించి ఏరియా ఉద్యోగులను,అధికారులను, సూపర్ వైజర్ లను కార్మికులను సమన్వయ పరచి వారందరినీ ఏకతాటి పైకి తెచ్చి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం అభినందనీయమైన అంశమని తెలిపారు.ఏరియా నందు జి యం దిశ నిర్దేశం, సమన్వయ పాలనతో కార్మిక వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మౌలిక వసతులు అందించడం దానితో పాటు ఏరియా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్మిక సంక్షేమం,అభివృద్ధి అమలు లో పారదర్శక ద్వారా ప్రత్యేక దృష్టి సారించడం ప్రతి కూల వాతావరణం లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధన కు ఎంతగానో దోహద పడ్డాయని ఆయన తెలిపారు..2023_24 ఆర్ధిక సంవత్సరంలో కూడా ఏరియా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించి మణుగూరు ఏరియా చరిత్రలోనే ఏనాడు రానటువంటి అత్యధిక లాభాలు 2315 కోట్లు దుర్గం. రామ చందర్ సారథ్యంలో సాధించడం జరిగిందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న బొగ్గు డిమాండ్ మేర ఈ ఏడాది కూడా మణుగూరు ఏరియా 3 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జించే అవకాశాలు లేకపోలేదని దీని వెనుక కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరి శ్రమ దాగి ఉందని తెలిపారు.. అంకిత భావం ప్రదర్శించి మణుగూరు ఏరియా ను అగ్రభాగాన నిలబెట్టేందుకు కష్టించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. ప్రకృతి వైపరిత్యాలు చుట్టు ముట్టినప్పటికీ కూడా అధికారులు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టకుండా రేయింబవళ్ళు కష్టించి పనిచేసి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టిన మణుగూరు ఏరియా కార్మికులకు స్వీట్ బాక్స్ లు అందించే అంశంలో యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయిల్, రామాచారి, పవన్ కుమార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









