+91 95819 05907

తొలి ప్రయత్నం లోనే గ్రూపు-1 ఫలితాల్లో లో సత్తా చాటిన వైరా యువతి సంగెపు లక్ష్మీ సాహితి కి ఘన సన్మానం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, శ్రీనివాస్:
వైరా : వారిది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరిని కుమారుడు,కూతురు ని చక్కగా చదివించారు. కూతురు ఆత్మవిశ్వాసమే తోడుగా ఉన్నతోద్యోగం సాధించడమే తన లక్ష్యంగా చేసుకుని తొలి ప్రయత్నం లోనే అద్భుతమైన విజయం సాధించింది. గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో129వ ర్యాంకు, మల్టీ జోన్-1 స్థాయిలో 69 స్థానం సాధించింది సంగెపు లక్ష్మీ సాహితీ.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం తల్లిదండ్రులు సంగెపు వెంకటేశ్వర్లు, సంగెపు కవిత తండ్రి ఎల్ఐసి ఏజెంట్ గా పని చేస్తున్నాడు. వైరాలో నివాసం ఉంటున్నారు. కూతుర్ని ఉన్నత చదువులు చదివించారు. పదవ తరగతి ఖమ్మం రెజోనెన్స్ 9.5 CGPA తో, ఇంటర్లో 96.7%, డిగ్రీలో 9.72 CGPA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చదివింది. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడం తన లక్ష్యం అన్నది.ఈ సందర్భంగా స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంమ్మిక రామారావు, చుండూరు రవి, దరిపల్లి శీను, కోటూరి వెంకటేశ్వర్లు, దురిశెట్టి గోవిందరావు, సంగేపు పెద్ద నరసింహారావు, వెలనాటి నాగరాజ్ తదితరులు సంగేపు లక్ష్మీ సాహితిని ఘనంగా సన్మానించారు. సంగేపు లక్ష్మీ సాహితీ రానున్న రోజుల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగి తమ గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !