+91 95819 05907

రేపు జరుగు ఏఐఎస్ఎఫ్ చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి:ఏఐఎస్ఎఫ్

*హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి*

*ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ*
ప్రచురణ ఏప్రిల్ 2 : బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన 400 ఎకరాల భూమి వేళాన్ని నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు జరుగు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చా మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో సెక్రెటరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు. వంశీ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీలో ఉనికి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితిలను గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశాలలకు అవసరమైన భూములు చేజారిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికికి ప్రమాదమని న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. కెసిఆర్ ను తరిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇలాంటి నియంతృత్వ విధానాలను కొనసాగించి విద్యార్థులని అని కూడా చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను కొనసాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోలీసులు వెనకకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంశి హెచ్చరిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో నవీన్, సాయి తేజ , రామ్ చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !