+91 95819 05907

రేషన్ కార్డున్న ప్రతిఒక్కరికి సన్నబియ్యం : ఎమ్మెల్యే డా. మైనంపల్లి

– పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీది
– నియోజక వర్గంలో నేటికి వెయ్యికోట్ల రూపాయలతో అభివృద్ధి
– మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

నేటి గదర్ మెదక్ జిల్లాప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 2.

మెదక్ పట్టణంలోని పోస్టాపీస్ సమీపంలోని రేషన్ దుకాణంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉగాది కానుకగా సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జాయింట్ కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, మెదక్ ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ. లక్ష్మణ్ లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే ముఖ్య లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వంది అని ఆయ గుర్తుచేశారు. అంతే కాకుండా పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే వచ్చాయని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి అని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుండి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి 24 లక్షల టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు. వాటిని మిల్లింగ్ చేయించి, వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా సంవత్సర కాలంలోనే మెదక్ నియోజక వర్గంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, తాజా మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, తాజా మాజీ కౌన్సిలర్ లు దాయర రాజలింగం, లక్ష్మినారాయణ గౌడ్, రాగి అశోక్, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, గోదల సాయి, దుర్గప్రసాద్, సమీ, బొద్దుల క్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు లల్లూ, గూడూరి శంకర్, దేవులా, గాడి రమేశ్, నాగరాజు, బట్టి సాయి, అశోక్, ఎం.డి. సూపి, ముజాంబిల్, మైసన్, అబ్బు, సాదిక్, కొండ శ్రీను, ప్రవీణ్, సుభాష్ చంద్రబోస్, చింతల శ్రీనివాస్, శివరామక్రిష్ణ, గంట రాజు లతో పాటు తదితరులు పాల్గోన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !