+91 95819 05907

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బుధవారం రోజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బిటీ రోడ్డు పనులను అయన ప్రారంభించారు.అదేవిదంగా రామాయంపేట పట్టణంలోని పలు వార్డులలో బిటీ రోడ్లను ప్రారంభించారు.అనంతరం రామాయంపేట ఎంపిడిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,సిఎంఆర్ఎఫ్ చెక్కులను అయన అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇప్పటి వరకు భవిష్యత్తులో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.మెదక్ జిల్లాలో శ్రీ ఏడుపాయల మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు.రామాయంపేట మండల వ్యాప్తంగా బీటీ రోడ్లు కలిపి 20 నుండి 30 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఇవాళ ప్రత్యేకంగా రామాయంపేట మున్సిపాలిటీలో 14 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకుంటున్నామని,ప్రభుత్వ దవాఖాన నుండి డబుల్ బెడ్ రూమ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే రామాయంపేట మండల కేంద్రంలో 20 నుండి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.గత 10 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి, మండల ఎంపీడీవో శాజీలోద్దీన్,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్,సరాపు యాదగిరి,దేమే యాదగిరి,సుందర్ సింగ్,చిలుక గంగాధర్,దేవుని జయరాజ్,సుంకోజు దామోదర్ చారి,యుగంధర్ రావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం :టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం =టియుడబ్ల్యుజె (ఐజెయు) నేతలతో మంత్రి పొంగులేటి ఖమ్మం: రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

Read More »

గ్యాస్ లీక్ ఆరుగురికి తీవ్ర గాయాలు…వారిలో ఇద్దరి మృతి

*ది. 29-04-25(మంగళవారం)- తల్లాడ మండలం-పాత మిట్టపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది,ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా,వారిలో ఇద్దరు మృతి చెందారు, పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్

Read More »

భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం పినపాక ఎమ్మెల్యే పాయం

## *భూ భారతి చట్టం 2025 అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ గారు, భద్రాచలం RDO దామోదర్ రావు

Read More »

కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్…!

– *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా…?* – *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు….మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు* – *అనాలోచితంగా

Read More »

ఎల్లాపురం గ్రామాన్ని సందర్శించిన తహసిల్దార్

ఎల్లాపురం గ్రామంను పరిశీలించిన తాసిల్దార్ పినపాక ఎల్లాపురం గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి పినపాక తాసిల్దార్ అద్దంకి నరేష్ గ్రామంలో పర్యటించారు. ఎల్లాపురం గ్రామంలో పెద్ద వాగు సమస్యతో తీవ ఇబ్బందులు

Read More »

సీతారామా ప్రాజెక్టు కాలవ ద్వారా రైతుల భూములకి నీళ్లు అందించాలి: బత్తుల

★కలెక్టర్, ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బత్తుల సీతారాం ప్రాజెక్టు కాలవ ద్వారా రైతులకు ద్వారా భూములకి నీళ్లు అందించాలని భూ భారతి అవగాహన సదస్సు బూర్గంపాడు రైతు వేదిక లో కలెక్టర్

Read More »

 Don't Miss this News !