+91 95819 05907

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బుధవారం రోజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బిటీ రోడ్డు పనులను అయన ప్రారంభించారు.అదేవిదంగా రామాయంపేట పట్టణంలోని పలు వార్డులలో బిటీ రోడ్లను ప్రారంభించారు.అనంతరం రామాయంపేట ఎంపిడిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,సిఎంఆర్ఎఫ్ చెక్కులను అయన అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇప్పటి వరకు భవిష్యత్తులో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.మెదక్ జిల్లాలో శ్రీ ఏడుపాయల మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు.రామాయంపేట మండల వ్యాప్తంగా బీటీ రోడ్లు కలిపి 20 నుండి 30 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఇవాళ ప్రత్యేకంగా రామాయంపేట మున్సిపాలిటీలో 14 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకుంటున్నామని,ప్రభుత్వ దవాఖాన నుండి డబుల్ బెడ్ రూమ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే రామాయంపేట మండల కేంద్రంలో 20 నుండి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.గత 10 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి, మండల ఎంపీడీవో శాజీలోద్దీన్,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్,సరాపు యాదగిరి,దేమే యాదగిరి,సుందర్ సింగ్,చిలుక గంగాధర్,దేవుని జయరాజ్,సుంకోజు దామోదర్ చారి,యుగంధర్ రావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !