+91 95819 05907

HCU భూముల వేలం పాటను ఆపాలి :సిపిఎం

సిపిఎం నాయకులు, విద్యార్థుల
అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ నిరసన గా ఖమ్మం లో ర్యాలీ,దిష్టి బొమ్మ దగ్ధం

ఖమ్మం : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలంపాటను ఆపాలని ప్రశ్నించిన విద్యార్థులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఏత్తివేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వర్రావు లు
డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు, విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో సరిత క్లినిక్ సెంటర్ వద్ద దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం జరిగింది. అంత కు ముందు పార్టీ జిల్లా ఆఫీస్ సుందరయ్య భవన్ నుండి నిరసన ర్యాలీ ప్రాంభమై,సరిత క్లినిక్ వరకు కోన సాగుంది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ అధ్యక్షతన
జరిగిన సభలో
వారు మాట్లాడుతూ కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల యూనివర్సిటీకు సంబంధించిన భూములను ప్రభుత్వం వేలంపాటను తక్షణమే ఆపి విశ్వవిద్యాలయానికి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని జీవ వైవిధ్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో నూతన భవనాలు వసతి గృహాలు కోర్సులు తదితర అనేక అవసరాలకు ఉపయోగపడే భూములను విశ్వవిద్యాలయానికే కేటాయించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ప్రజల న్యాయమైన డిమాండ్ ను ఆలోచన చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను రాజకీయ పార్టీలను నిరంకుశంతో అణచివేస్తుందని విమర్శించారు. యూనివర్సిటీకి సంబంధించిన భూముల పై ప్రభుత్వం అడుగుపెట్టి అర్హత లేదని అన్నారు భవిష్యత్తు లో విశ్వవిద్యాలయాలను పరిశోధన కేంద్రాలుగా మార్చి అభివృద్ధి చేయడం మానేసి యూనివర్సిటీలలోకి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులను ప్రోత్సహించడం ఏమిటి అని ప్రశ్నించారు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని 400 ఎకరాల భూమి HCU కు అప్పగించాలని రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకత్వాన్ని విడుదల చేసి విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలను కలుపుకొని దీర్ఘ కాల ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
యూనివర్సిటీ భూములు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలని, ఈ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించి యూనివర్సిటీ మూలాలను దెబ్బతీయొద్దని, ప్రజాస్వామ్య పద్ధతులో శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని
పోలీసులను ఉపయోగించి ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాల ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం
చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు
బుగ్గవీటి సరళ,M. సుబ్బారావు,
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్,బండి పద్మ , జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, S.నవీన్ రెడ్డి దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య, ఎస్ కే బషీరుద్దీన్, పార్టీ వన్ టౌన్, టూ టౌన్,3టౌన్ కార్యదర్శులు నాగుల్ మీరా,బోడపట్ల సుదర్శన్, భూక్యా శ్రీనివాస్,
పార్టీ కార్పోరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు,జిల్లా నాయకులు ఆర్. ప్రకాష్, SK.సైదులు, మాచర్ల గోపాల్ K.అమరావతి, SFI జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్, SFI అధ్యక్షులు పి. సుధాకర్, పాపారావు, ఎస్ కే ఇమామ్, గుమ్మడి బిక్షం, ఎస్కే ఆఫ్జల్, శ్రీమన్నారాయణ, మాచర్ల సైదులు,
మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్
భాగం అజిత, నైరుణిస్తా బేగం,
తదితరులు పాల్గొన్నారు. -ప్రకాష్

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

కౌన్సిలర్ పదవి రద్దు…

పార్టీ మారిన ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్‌మాధవిపై వేటు వేసిన జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించిన 8వ వార్డు కౌన్సిలర్‌

Read More »

 Don't Miss this News !