+91 95819 05907

పేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం పంపిణీ: ఎమ్మెల్యే పాయం

★ప్రారంభోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
– సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకం అని కితాబు.
పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కితాబిచ్చారు. పినపాక మండలం జగ్గారం గ్రామపంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని, ఈ పథకం పేదల గుండెల్లో నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో అర్హులైన పేద ప్రజలందరికి రేషన్ కార్డులలతోపాటు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయకపోగా, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అనవసరంగా సోషల్ మీడియా రాద్ధాంతాలు చేస్తుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, కనీస జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, కౌలు రైతులకు సైతం ఆర్థిక సహాయం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ బండ పై సబ్సిడీ, ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పేరుతో లోన్లు, ఇందిరమ్మ ఇల్లులు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలోనే తన హయాంలో అనేక రహదారులు ఏర్పాటు చేశామని, కొత్తగా మరికొన్ని రహదారులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం, ఎంపీడీవో సునీల్ కుమార్, తహశిల్దార్ అద్దంకి నరేష్, మండల వ్యవసాయ శాఖాధికారి ఈ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, మాజీ సర్పంచులు తోలెం కళ్యాణి, కొర్శా కృష్ణం రాజు, ఈసం భవతి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !