+91 95819 05907

రేపు జరగబోయే చలో సెక్రటేరియట్ ముట్టడినీ జయప్రదం చేయండి..SFI

– ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే విద్యార్థుల హక్కులను కాలరాయడమేనా ! SFI

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – SFI

– 400 ఎకరాల భూమిని యూనివర్శీటీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి.

*ఎస్ఎఫ్ఐ(SFI)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ.*

: హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతుంటే వారిని అక్రమంగా వీధి రౌడీలాగ లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య అని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు, కొప్పుల రవీందర్ అన్నారు.రేపు జరగబోయే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి వారు పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు భూపేందర్ మాట్లాడుతూ…. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీ ఉనికి ప్రమాదంగా మారుతుందని ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకరమైన పరిస్థితులను ముందుగానే గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశారులకు అవసరమైన భూములు చేజారి పోతే భవిష్యత్తు తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికి ప్రమాదం అని న్యాయబద్ధంగా 400 ఎకరాల భూముల రక్షణ కోసం శాంతియుతంగా నిరసన కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి ఆ ప్రజాస్వామికంగా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని వేల కోట్ల విలువైన హెచ్. సి. యు భూములను కార్పోరేట్‌ శక్తులకు దారదత్తం చేసేందుకై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని అన్నారు. అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్‌, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎన్నో వృక్ష , జంతు జాతులకు నిలయంగా ఉన్న ఆ భూములను వేలం వేయడం సరికాదన్నారు. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. విద్యార్థలపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘటనలకు నిరసనగా శాంతియుతంగా ప్రజాస్వామిక బద్దంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఆడవాళ్లను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకుంటూ వాహనాల్లో నిర్బంధించారని ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అప్ ప్రజాస్వామికంగా విద్యార్థులపై అక్రమ అరెస్టులు పెట్టడం ఏంటి అని వారు ప్రశ్నించారు. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని వారి ప్రభుత్వం యొక్క నియంత పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. హెచ్. సి.యు భూములను యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరని ఖండించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !