+91 95819 05907

రేపు జరగబోయే చలో సెక్రటేరియట్ ముట్టడినీ జయప్రదం చేయండి..SFI

– ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే విద్యార్థుల హక్కులను కాలరాయడమేనా ! SFI

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి – SFI

– 400 ఎకరాల భూమిని యూనివర్శీటీ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి.

*ఎస్ఎఫ్ఐ(SFI)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ.*

: హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు పోరాడుతుంటే వారిని అక్రమంగా వీధి రౌడీలాగ లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సిగ్గుమాలిన చర్య అని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు, కొప్పుల రవీందర్ అన్నారు.రేపు జరగబోయే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి వారు పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు భూపేందర్ మాట్లాడుతూ…. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీ ఉనికి ప్రమాదంగా మారుతుందని ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకరమైన పరిస్థితులను ముందుగానే గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశారులకు అవసరమైన భూములు చేజారి పోతే భవిష్యత్తు తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికి ప్రమాదం అని న్యాయబద్ధంగా 400 ఎకరాల భూముల రక్షణ కోసం శాంతియుతంగా నిరసన కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి ఆ ప్రజాస్వామికంగా, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని వేల కోట్ల విలువైన హెచ్. సి. యు భూములను కార్పోరేట్‌ శక్తులకు దారదత్తం చేసేందుకై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నుతోందని అన్నారు. అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్‌, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎన్నో వృక్ష , జంతు జాతులకు నిలయంగా ఉన్న ఆ భూములను వేలం వేయడం సరికాదన్నారు. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. విద్యార్థలపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘటనలకు నిరసనగా శాంతియుతంగా ప్రజాస్వామిక బద్దంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఆడవాళ్లను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని మరి ఈడ్చుకుంటూ వాహనాల్లో నిర్బంధించారని ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అప్ ప్రజాస్వామికంగా విద్యార్థులపై అక్రమ అరెస్టులు పెట్టడం ఏంటి అని వారు ప్రశ్నించారు. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని వారి ప్రభుత్వం యొక్క నియంత పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. హెచ్. సి.యు భూములను యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరని ఖండించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !