★ఎస్ఐ రాజ్ కుమార్
ఆదివాసి యువత సన్మార్గంలో ప్రయాణించి , వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ సూచించారు. గురువారం పినపాక మండలం ఎర్రగుంట ఆదివాసి గ్రామంలో ఆయన మాట్లాడారు. యువత సన్మార్గంలో ప్రయాణించి గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని తెలిపారు. గ్రామాలకు కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 129









