-గొల్లగూడెం ఈద్గా ముతవల్లి ఎం.డి. ఇలియాస్
ఖమ్మం/ఏప్రిల్ 02
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కొంతమంది నాయకులు చేసిన వ్యాఖ్యలు నిజమైన సెక్యులర్ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు దేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలను కూడా అవహేళన చేసేలా ఉన్నాయి. మత పరమైన వేడుకల్లో, ప్రతి మతానికి చెందిన వ్యక్తులు పాల్గొనడం సహజమే. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే భావనతో ఈద్గాలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రతి భారత పౌరుడికీ మతపరమైన వేడుకల్లో పాల్గొనే హక్కు ఉంది. ఎవరు ఎక్కడ ఉన్నా, మతపరమైన వేడుకల్లో భాగస్వామ్యం కావడం వారి వ్యక్తిగత హక్కు ఇస్లాం మతం కూడా ఇదే చెపుతుంది. ఎవరు ప్రార్థన స్థలాల్లోకి వచ్చినా వారిని గౌరవించాలి, ఆహ్వానించాలనే చెపుతుంది. పువ్వాడ అజయ్ కుమార్ ఈద్గాలో పాల్గొనడం, ముస్లిం సోదరులతో ఐక్యతను చాటడం ప్రజాస్వామ్య ప్రేరణకు నిదర్శనం. దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు ఏ మతానికి చెందినవైనా, సమాజంలోని ప్రతి వర్గం వాటిని జరుపుకుంటుంది. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియ చేసుకుంటారు.
కానీ దురదృష్టవశాత్తు పవిత్ర రంజాన్ రోజున కొందరు వ్యక్తులు, మాజీ మంత్రి అజయ్ కుమార్ పట్ల చేసిన వ్యాఖ్యలను, గొల్లగూడ ఈద్గా ముతవల్లి మొహమ్మద్ ఇలియాస్ తీవ్రంగా ఖండించారు.









