+91 95819 05907

విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రేవంత్ సర్కార్ అక్రమంగా కొల్లగొట్టేందుకు చూస్తుందని ఇల్లందు డివిజన్ కార్యదర్శి నరేందర్ అన్నారు.అమ్మకాన్ని విరమించుకోవాలని హైద్రాబాద్ సెక్రటేరియట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హెయమైన చర్య అని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని, ఉస్మానియా యూనివర్సిటీ లో అప్రజాస్వామిక సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని పి డి యస్ యూ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో సెక్రెటరియట్ కార్యక్రమంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ లతో పాటు వామపక్ష విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఇది అప్రజాస్వామిక చర్య అని వారు అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ సంస్థల నుండి వేల కోట్ల రూపాయల కమిషన్లు ఆశించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల భూములను వేలం వేసి నిర్ధాక్షణంగా అమ్ముకోవడాన్ని పి డి యస్ యూ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. భూముల రక్షణ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేపడితే విద్యార్థులపై లాఠీని జులిపించి విద్యార్థినీలు అని చూడకుండా జుట్టు బట్టి లాక్కుంటూ లాఠీలతో చితక భాదారని రేవంత్ రెడ్డి ఇదే అహంకారంతో క్రూరత్వాన్ని కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఖమ్మం లో ముందస్తు పేరుతో అరెస్టు చేసిన పి డి యస్ యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్, ఇతర జిల్లాలలో అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘ నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !